Read more!

English | Telugu

రిషిపై ఎటాక్ తో ఇంట్లో వాళ్ళంతా షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌ -756 లో.. రిషి, వసుధారలు కాలేజీలో మట్లాడుకుంటూ.. వాళ్ళు మొదటిసారి కలుసుకున్నప్పటి జ్ఞాపకాలని పంచుకుంటారు. అలా వాళ్ళు ప్రేమగా మాట్లాడుకుంటుండగా.. వాళ్ళున్న గది కిటీకి నుండి ఎవరో బయటవైపు వెళ్ళినట్టుగా గమనించి తొందరగా బయటకొచ్చి చూస్తారు. కానీ ఎవరు కనిపించరు. అలా కాలేజీ బయటకు వచ్చి.. కార్ ముందు నిల్చొని రిషి, వసుధార ఇద్దరు అటుఇటు చూస్తుంటారు. ఇంతలో కార్ వెనుకాల నుండి ఒక మాస్క్ వేసుకున్న దుండగుడు రిషి వెనకాల నుండి వచ్చి కత్తితో పొడవాలనుకుంటాడు. అప్పుడే రిషి పక్కకు తప్పుకుంటాడు. దీంతో ఆ మాస్క్ చేసుకున్న దుండగుడు రిషి, వసుధారల ముందుకు ఫాస్ట్ గా వచ్చేస్తాడు. దాంతో ఇద్దరు వాడిని చూస్తారు. రిషి అతడిని వెంబడిస్తాడు.‌. కానీ దొరకడు.. కాలేజీ గోడ దూకి పారిపోతాడు. ఇక వసుధార కంగారుపడుతూ ఇంటికి వెళ్దామని అంటుంది.

అలా‌ రిషి వసుధారలు కాలేజీ నుండి ఇంటికి వెళ్తుండగా.. కార్ ని మధ్యలో ఆపమని వసుధార అంటుంది. ఆ తర్వాత రిషి మీద పడి ఏడుస్తుంది. ఏమైందని రిషి అడుగగా.. భయమేస్తుంది సర్.. తృటిలో ప్రమాదం తప్పిందని, చాలా ఏడుస్తుంది వసుధార. ఆ తర్వాత వసుధారకి రిషి నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. కాలేజీలో జరిగిందంతా రిషీ, వసుధారలు ఇంట్లో అందరితో చెప్తారు. అది విని మహేంద్ర, జగతి, ఫణీంద్ర, ధరణి అందరూ షాక్ అవుతారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వాళ్ళపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని ఫణీంద్ర అనగా.. వద్దని రిషి ఆపుతాడు. ఎందుకని ఫణీంద్ర అని అడుగగా.. మన కాలేజీ పరువు పోతుంది. స్టూడెంట్స్ లైఫ్ ఏమైపోతుంది. ఇప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనల్ని ఎటాక్ చేసినవాళ్ళు ఇంకా జాగ్రత్త పడతారని రిషి చెప్తాడు. మరి ఎలా రిషి.. వాళ్ళని అలా వదిలేద్దామా అని జగతి అడుగగా.. వదిలేయండి మేడమ్ అని చెప్పేసి రిషి వెళ్తాడు.

ఆ తర్వాత రిషిని ఎటాక్ చేసిన ఆ దుండగుడు వాళ్ళ ఇంటిబయట శైలేంద్ర కోసం ఎదురుచూస్తుంటాడు. అప్పుడే జగతి వాళ్ళ ఇంటి మేడ మీద నుండి చూస్తుంది. అప్పుడే ఆ దుండగుడి దగ్గరికి శైలేంద్ర వచ్చి.‌. వాడికి రిషిని చంపడానికి ఇస్తాననన్న డబ్బులు మొత్తం ఇస్తాడు. అలా డబ్బులు ఇచ్చి.. ఇంకెక్కడా కనపడకూడదని శైలేంద్ర అంటాడు. ఇదంతా మేడమీద నుండి జగతి చూస్తుంది. ఆ తర్వాత శైలేంద్ర, దేవయాని వారి గదిలో మాట్లాడుకుంటారు. ఏంటి శైలేంద్ర నువ్వు పంపినవాడు రిషిని చంపలేదు కదా అని అనగా.. రిషి తప్పించుకోవడం మంచిదైంది.. ఇప్పుడు రిషీతో పాటుగా జగతి, మహేంద్ర, వసుధారలకి కూడా భయం పుట్టింది. ఈ ఎటాక్ డోస్  ఇంకా పెరుగుతుంది అని అనేసరికి జగతి డోర్ తీసి.‌‌. శైలేంద్ర అని అరుస్తుంది. ఆ తర్వాత జగతి వాళ్ళిద్దరిని తిడుతుంది. మీ విషయం ఇంట్లో వాళ్ళందరికి చెప్తానని జగతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.