Read more!

English | Telugu

అత్తారింటి నుండి రాజ్ రానని చెప్పడంతో బాధపడ్డ అపర్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -72 లో.. రుద్రాణి, అపర్ణ ఇద్దరూ కార్ లో వెళ్తూ.. కనకం వాళ్ళ ఇంటి అడ్రస్ ని దారిలో వెళ్తున్న స్వప్నని అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత కనకం ఇంటికి వెళ్తారు. మరోవైపు రాజ్ పడుకొని ఉండగా.. రాజ్  నడుముకి ఆయిట్‌మెంట్ రాయాలా అని అడుగుతుంది కావ్య. అది పట్టించుకోకుండా అసలు ఫస్ట్ నైట్ రోజు స్టోర్ రూమ్ లోకి ఎందుకు వచ్చాను? ఏం జరిగిందని అడుగుతాడు రాజ్. అప్పుడు కావ్య మీరు ఆయిట్‌మెంట్ రాసుకుంటే చెప్తానని అనగా, రాజ్ సరే అంటాడు. ఆ తర్వాత కావ్య అన్ని సగం సగం చెప్తుంది. మీరు తాగేసి నా గదిలోకి వచ్చారంటూ ఆయిట్‌మెంట్ రాస్తుండగా.. తనకి చెక్కిలిగింతలు అవుతున్నాయంటూ రాజ్ నవ్వుతాడు. ఇక అదే సమయంలో అపర్ణ, రుద్రాణి‌ ఇద్దరూ కనకం వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరికి వస్తారు. రాజ్ అలా నవ్వుతు ఉండడం చూసిన అపర్ణ.. నా కొడుకుని పూర్తిగా మార్చేశారంటూ బాధపడుతూ.. రాజ్ అని గట్టిగా పిలుస్తుంది.

ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావ్ రాజ్.. నీకు దెబ్బ తగిలినట్లు ఎందుకు నాకు చెప్పలేదని అపర్ణ అడుగుతుంది. నీకెవరు చెప్పారు మమ్మీ అని రాజ్ అడుగుతాడు. అలా అడగగానే పక్కనే ఉన్న కావ్య నేనే చెప్పానని అంటుంది. పదా రాజ్ మన ఇంటికి  వెళ్దామని అపర్ణ అనగానే.. నేను ఇప్పుడు వెళ్తే స్వప్నని తర్వాత రప్పించుకుంటారని భావించిన రాజ్.. లేదు మమ్మీ రేపు పొద్దున్నే వస్తానని అంటాడు. అలా రాజ్ అనగానే.. నిన్న నా మాట  కాదని వచ్చావ్.. ఇప్పుడు నన్ను వెళ్లిపొమ్మంటున్నావ్ అని బాధపడుతూ రుద్రాణిని తీసుకొని వెళ్ళిపోతుంది అపర్ణ. ఆ తర్వాత అపర్ణ, రుద్రాణి వెళ్లడం చాటుగా స్వప్న చూస్తుంది. ఇంకా వీధిలో వాళ్ళు చూసి కనకం ఇంటికి దుగ్గిరాల ఫ్యామిలీ వస్తూ పోతున్నారు.. కావ్య మంచి అమ్మాయి.. ఆ పెద్దది కోపిష్టి అంటూ.. కావ్య గురించి మంచిగా, స్వప్న గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అలా వాళ్ళు మాట్లాడుకోవడం విన్న స్వప్న బాధపడుతుంది. ఆ తర్వాత కావ్య తన ఇంట్లో వాళ్ళతో అత్తవారింట్లో తను ఉండే సిచ్యువేషన్.. వాళ్ళు తనతో ఉన్న తీరుని.. అంతా చెప్తూ బాధపడుతుంది. ఇంత బాధ మనసులో పెట్టుకొని ఎలా వుంటున్నావ్ అమ్మా అని కృష్ణమూర్తి, కనకంలు అడుగుతారు. దాంతో ఎప్పటికైనా వాళ్లలో మార్పు వస్తుందని ఎదురుచూస్తున్నానని కావ్య అంటుంది. అప్పు మాత్రం కావ్యని పట్టుకొని ఏడుస్తుంది.

మరోవైపు కనకం ఇంటినుండి వాళ్ళింటికి వెళ్లిన అపర్ణ.. కనకం ఇంట్లో జరిగిందంతా చెప్తూ బాధపడుతుంది. అపర్ణ పక్కనే ఉన్న రుద్రాణి తనకి ఇంకా కోపం వచ్చేటట్టు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.