English | Telugu

లేగ‌దూడ మూతిని ఎందుకు క‌ట్టేశామో తెలుసా?.. కౌంటర్ ఇచ్చిన సుమ!

యాంకర్ సుమ తన టీవీ షోలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. సాధారణంగా సుమపై నెగెటివ్ కామెంట్స్ కానీ.. ట్రోలింగ్ కానీ జరగదు. మహా అయితే ఆమెపై ఫన్నీ కామెంట్స్ చేస్తుంటారు. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు. దానికి కారణం ఏంటంటే.. రీసెంట్ గా సుమ లేగదూడతో ప్రేమగా ఆడుకుంటున్న వీడియోను షేర్ చేశారు. అయితే ఆ లేగ దూడ మూతిని కట్టేయడంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఆవు పాలతో వ్యాపారం చేసేవారు లేగదూడల విషయంలో కాస్త కఠినంగా ఉంటారు.

సుమ షేర్ చేసిన వీడియోలో లేగదూడ మూతికి వెదురు బుట్టి కట్టేయడంతో నెటిజన్లు ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆవు పాలు లేగ దూడకు చెందాలి.. అలా కాకుండా మీరు దాని మూతిని కట్టేసి ఆవు పాలను అమ్ముకుంటున్నారా..? అంటూ సుమను ప్రశ్నించారు. ఈ విషయంలో చాలా మంది సుమకు మద్దతుగా నిలిచారు. లేగదూడ చిన్నది కాబట్టి చెత్తా చెదారాన్ని తినకుండా అలా కట్టి ఉంటారని సుమకి సపోర్ట్ గా పోస్ట్ లు పెట్టారు.

తనపై జరుగుతోన్న ట్రోలింగ్ కి గట్టి సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్న సుమ మరో వీడియో షేర్ చేశారు. అందులో లేగదూడను పట్టుకొని ఉన్న పాలేరుని.. రాముడి (లేగదూడ) మూతికి మొన్న బుట్టి ఎందుకు కట్టారని సుమ ప్రశ్నించారు. దానికి అతడు మట్టిని తినకుండా ఉండడానికి అలా కట్టానని చెప్పుకొచ్చాడు. ఆవును పెంచుకుంటోంది.. దాని పాలతో వ్యాపారం చేసేందుకు కాదు.. గోమూత్రంతో మంచి ఎరువు వస్తుందని.. ఆవు ఉంటే మంచిదని పెంచుకుంటున్నామని సుమ చెప్పుకొచ్చారు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.