English | Telugu

వ్యాక్సిన్ వేయించుకోవడానికి అనసూయ పాట్లు!

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. తరచూ ఏదొక టాపిక్ మీద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. ఆమెకి సపోర్ట్ చేసే వారికంటే ట్రోల్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆమె డ్రెస్సింగ్ విషయంలో ఎప్పటికప్పుడు ట్రోల్స్ పడుతూనే ఉంటాయి. అయినప్పటికీ అనసూయ మాత్రం తనకు నచ్చినట్లే ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ తన భర్త భ‌రద్వాజ్‌తో కలిసి వ్యాక్సిన్ వేయించుకుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో స్వచ్చంద సంస్థలు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపడుతున్నారు. దీంతో అనసూయ కూడా వ్యాక్సిన్ కోసం వెళ్లింది. అయితే ఆమెకి సూది మందంటే భయమని తెలుస్తోంది.

వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో భర్త చేతిని గట్టిగా పట్టుకొని.. కళ్లు మూసుకొని తెగ భయపడిపోయింది. మొత్తానికి వ్యాక్సిన్ వేయించుకున్నామని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంకుర హాస్పిటల్స్ చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ బాగుందని కూడా అనసూయ కితాబిచ్చింది. ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. బుల్లితెరపై టీవీ షోలు చేస్తూనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. 'పుష్ప' లాంటి భారీ బడ్జెట్ సినిమాలో ఓ పాత్రలో కనిపించనుంది. అలానే తమిళ, మలయాళ సినిమాల్లో కొన్ని సినిమాలు చేస్తోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.