English | Telugu

"అఖిలే నెంబర్ వన్.. దృష్టి తీయాలి".. మోనాల్ కామెంట్‌ వైర‌ల్‌!

బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అఖిల్ సార్థక్ ఫైనల్స్ వరకు చేరుకొని రన్నరప్ గా నిలిచాడు. ఈ షో నుండి బయటకి వచ్చిన తరువాత అఖిల్ కి పలు వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటించే అవకాశాలు దక్కుతున్నాయి. అయితే తాజాగా అఖిల్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతి ఏడాది హైదరాబాద్ టైమ్స్ వాళ్లు నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ టీవీ పర్శనాలిటీ జాబితాలో 2020 ఏడాదికి గాను మేల్ కేటగిరీలో అఖిల్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు.

దీంతో బుల్లితెరతో పాటు వెండితెరకు చెందిన సెలబ్రిటీలు కూడా అఖిల్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పుడే కాదు.. గతంలో కూడా అఖిల్ ఓ సారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా ఎంపికయ్యాడు. దానికి సంబంధించిన హైద‌రాబాద్ టైమ్స్ స్టోరీని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అఖిల్ షేర్ చేశాడు. దీనిపై అత‌డి స్నేహితురాలు, బిగ్ బాస్ షో మాజీ కంటెస్టెంట్ మోనాల్ స్పందించింది. "దృష్టి తీయాలి" అంటూ కామెంట్ పెట్టింది.

అంతే కాదు, తన ఇన్స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పెట్టింది. "అందరూ చూడండి.. మా దోస్త్ అఖిలే నెంబర్ వన్" అంటూ ముద్దుల ఎమోజీలను జోడించింది. దీంతో మరోసారి అఖిల్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరచినట్లయింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'తెలుగు అబ్బాయి గుజరాత్‌ అమ్మాయి' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన టీజర్ కూడా వచ్చింది. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ కానున్న‌ది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.