English | Telugu
దివి కళ్లల్లోకి చూస్తూ కవిత్వం ఒలికించిన ఓంకార్!
Updated : Jul 1, 2021
ఈ మధ్యకాలంలో బుల్లితెరపై వస్తోన్న ఎంటర్టైన్మెంట్ షోల సంఖ్య ఎక్కువవుతోంది. రోజుకో కొత్త రకం షో పుట్టుకొస్తోంది. అయితే వీటిల్లో ఓంకార్ హోస్ట్ చేసే షోలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. 'ఇస్మార్ట్ జోడీ', 'డాన్స్ ప్లస్', 'సిక్స్త్ సెన్స్' వంటి షోలతో ఓంకార్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గా డాన్స్ ప్లస్ షో పూర్తి చేసిన ఓంకార్ ఇప్పుడు సిక్స్త్ సెన్స్ నాల్గో సీజన్ ను మొదలుపెట్టాడు.
ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లలో టాలీవుడ్ సెలబ్రిటీలు, బుల్లితెర తారలు పాల్గొన్నారు. ఇప్పుడు నాల్గో సీజన్లో ఎక్కువగా టీవీ తారలను గెస్ట్ లుగా తీసుకొస్తున్నాడు. ఇప్పటికే హైపర్ ఆది, అనసూయ, అషురెడ్డి.. ఇలా చాలా మంది టీవీ తారలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ లను ఈ షోకి అతిథులుగా తీసుకొచ్చారు.
అఖిల్ సార్థక్, దివి వడ్త్య ఈ షోకి వచ్చారు. తన 'వన్ సెకండ్' కాన్సెప్ట్ తో అఖిల్ ని బాగా టెన్షన్ పెట్టేశాడు ఓంకార్. బిగ్ బాస్ ఫైనల్స్ సమయంలో కూడా ఇంత టెన్షన్ పడలేదని అఖిల్ అన్నాడు. 'నీలో ఇన్ని షేడ్స్ ఏంటన్నా.. అపరిచితుడు నువ్' అంటూ ఓంకార్ పై కామెంట్ చేశాడు. ఆ తరువాత 'నాగిన్' పాటకు తనదైన స్టైల్ లో డాన్స్ వేసి ఆకట్టుకుంది పొట్టి డ్రస్లో వచ్చిన దివి. ఆ తరువాత దివి కళ్లల్లోకి చూస్తూ "మెస్మరైజింగ్ లాంటి కళ్లు నీవి. అందుకే నీకు పెట్టారు పేరు దివి" అంటూ ఓంకార్ కవిత్వం ఒలికించాడు. యాంకరింగే కాదు, ఓంకార్లో ఈ కళ కూడా ఉందన్న మాట.. అంటున్నారు నెటిజన్లు.