English | Telugu

దివి కళ్లల్లోకి చూస్తూ క‌విత్వం ఒలికించిన ఓంకార్!

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై వస్తోన్న ఎంటర్టైన్మెంట్ షోల సంఖ్య ఎక్కువవుతోంది. రోజుకో కొత్త రకం షో పుట్టుకొస్తోంది. అయితే వీటిల్లో ఓంకార్ హోస్ట్ చేసే షోలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. 'ఇస్మార్ట్ జోడీ', 'డాన్స్ ప్లస్', 'సిక్స్త్ సెన్స్' వంటి షోలతో ఓంకార్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. రీసెంట్‌గా డాన్స్ ప్లస్ షో పూర్తి చేసిన ఓంకార్ ఇప్పుడు సిక్స్త్ సెన్స్ నాల్గో సీజన్ ను మొదలుపెట్టాడు.

ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లలో టాలీవుడ్ సెలబ్రిటీలు, బుల్లితెర తారలు పాల్గొన్నారు. ఇప్పుడు నాల్గో సీజన్‌లో ఎక్కువగా టీవీ తారలను గెస్ట్ లుగా తీసుకొస్తున్నాడు. ఇప్పటికే హైపర్ ఆది, అనసూయ, అషురెడ్డి.. ఇలా చాలా మంది టీవీ తారలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ లను ఈ షోకి అతిథులుగా తీసుకొచ్చారు.

అఖిల్ సార్థ‌క్‌, దివి వ‌డ్త్య‌ ఈ షోకి వచ్చారు. తన 'వన్ సెకండ్' కాన్సెప్ట్ తో అఖిల్ ని బాగా టెన్షన్ పెట్టేశాడు ఓంకార్. బిగ్ బాస్ ఫైనల్స్ సమయంలో కూడా ఇంత టెన్షన్ పడలేదని అఖిల్ అన్నాడు. 'నీలో ఇన్ని షేడ్స్ ఏంటన్నా.. అపరిచితుడు నువ్' అంటూ ఓంకార్ పై కామెంట్ చేశాడు. ఆ తరువాత 'నాగిన్' పాటకు తనదైన స్టైల్ లో డాన్స్ వేసి ఆకట్టుకుంది పొట్టి డ్ర‌స్‌లో వ‌చ్చిన‌ దివి. ఆ తరువాత దివి కళ్లల్లోకి చూస్తూ "మెస్మరైజింగ్ లాంటి కళ్లు నీవి. అందుకే నీకు పెట్టారు పేరు దివి" అంటూ ఓంకార్ కవిత్వం ఒలికించాడు. యాంక‌రింగే కాదు, ఓంకార్‌లో ఈ క‌ళ కూడా ఉందన్న మాట.. అంటున్నారు నెటిజ‌న్లు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.