Read more!

English | Telugu

వీళ్ళే డాన్స్ ఐకాన్ కి మెయిన్ మెంటార్స్

తాను స్టార్ట్ చేయబోయే "డాన్స్ ఐకాన్ "షో గురించి చెప్తూ ప్రమోట్ చేసుకోవడానికి ఏ సందర్భాన్ని వదలడం లేదు ఓంకార్. ఇక ఈ షోకి ఫేమస్ టీవీ యాంకర్లు, శ్రీముఖి, డాన్స్ మాస్టర్ యష్, యాక్టర్ మోనాల్ గుజ్జర్ ఈ షోకి మెయిన్ మెంటార్స్ కి ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ కొరియోగ్రాఫర్, జడ్జి శేఖర్ మాస్టర్ త్వరలో రాబోయే ఈ  డ్యాన్స్ షోకి ప్రధాన న్యాయనిర్ణేతలలో ఒకరుగా ఉండబోతున్నారంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఓంకార్ ఇంతకుముందు చేసిన  డ్యాన్స్ షో 'డాన్స్ +'లో యష్, మోనాల్ జడ్జెస్ గా ఉండగా, ఇప్పుడు తాజాగా వాళ్ళతో శ్రీముఖి చేరింది. ఈ షోలో 5 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న వారు పాల్గొంటారని గతంలోనే చెప్పాడు  ఓంకార్. 'డ్యాన్స్ ఐకాన్' ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే  అవకాశం ఉంది. టీవీ, OTT ప్లాట్ఫారం పై  ఒకేసారి ప్రసారమయ్యే మొదటి తెలుగు డ్యాన్స్ రియాలిటీ షోలలో ఇది ఒకటి. అయితే, ఈ అంశాలకు సంబంధించి ఎలాంటి ఆఫీషియల్ న్యూస్ ఇంకా బయటకు రాలేదు.

తనకు ఈ అవకాశం వచ్చినందుకు తాను ఎంతో హ్యాపీగా ఫీలయ్యానని ఈ సందర్భంగా షో హోస్ట్, ప్రొడ్యూసర్ ఓంకార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాను  ఇంతకుముందు చేసిన డ్యాన్స్ షోల కంటే కూడా ఈ షో చాలా స్పెషల్ గా ఉంటుందని చెప్పారు. అన్ని షోస్ లోకి ఈ షోని ఒక ఐకాన్ లా మార్చడం కోసం 'డ్యాన్స్ ఐకాన్' అనే  టైటిల్ పెట్టినట్లు చెప్పారు. ఈ షోకి సంబంధించి కొరియోగ్రాఫర్స్, పార్టిసిపెంట్స్ జీవితాలను మలుపు తిప్పేలా డిజైన్ చేశామన్నారు. అంతేకాదు ఈ షోలో విన్ ఐన కొరియోగ్రాఫర్  టాలీవుడ్ టాప్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేస్తారని చెప్పుకొచ్చారు.