English | Telugu

Brahmamudi : రిపోర్ట్స్ చూసి దుగ్గిరాల కుటుంబం షాక్.. కావ్య ఎమోషనల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -937 లో....రిపోర్ట్స్ లో ఏం వస్తాయోనని ఇంట్లో అంత టెన్షన్ పడుతుంటే కావ్య పాపతో ముచ్చట్లు పెడుతుంది. ఏంటి కావ్య మేం అంత ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రం కూల్ గా ఉన్నావని ఇందిరాదేవి అంటుంది. నాకెందుకు టెన్షన్.. రిపోర్ట్స్ లో ఏం వస్తుందో నాకు తెలుసు కదా అని కావ్య అంటుంది. ఈ టెన్షన్ నా వాళ్ల కాదు.. ఒరేయ్ డాక్టర్ ఫోన్ చేసి అడగమని ఇందిరాదేవి అనగానే డాక్టర్ కి రాజ్ ఫోన్ చేస్తాడు. కాసేపటికి డాక్టర్ రిపోర్ట్స్ పంపిస్తాడు. అవి చూసి రాజ్ షాక్ అవుతాడు. కళ్యాణ్ ఫోన్ తీసుకొని చూస్తాడు. తను కూడా షాక్ అవుతాడు.

రిపోర్ట్స్ లో ఏం వచ్చిందని సుభాష్ అడుగగా పాప మా బిడ్డ అన్నట్లుగానే వచ్చిందని రాజ్ అంటాడు. దాంతో ఇంట్లో అందరు షాక్ అవుతారు. నో అంటూ కావ్య గట్టిగా అరుస్తుంది. ఇప్పటికైనా బిడ్డని దగ్గరికి తీసుకొని నీలోని మమకారం బయటకు తియ్ అని అపర్ణ అంటుంది. మీరు ఎన్ని రిపోర్ట్స్ తీసుకొని వచ్చినా నేను ఇలాగే ఉంటాను.. తను నా బిడ్డ కానే కాదని కావ్య చెప్తుంది. మరొకవైపు మినిస్టర్ ఇంటికి రుద్రాణి వెళ్తుంది. కంగ్రాట్స్ అండి రిపోర్ట్స్ మార్చారు. ఇక కావ్యకి బిడ్డ గురించి తెలిసే ఛాన్స్ లేదు. రాను రాను తన దగ్గర ఉన్న బిడ్డ ఆరోగ్యం బాలేక దూరం అవుతుంది. దాంతో ఆ కావ్య పిచ్చిది అవుతుంది. నా పగ చల్లారుతుందని రుద్రాణి అనగానే మినిస్టర్ డల్ అవుతాడు. మీరేం బాధపడకుండి.. మీ భార్య మీరు పాపతో హ్యాపీగా ఉంటారని రుద్రాణి అనగానే ఇదంతా మీ వల్లే.. మీకు ఏం చేసినా తక్కువే అని మినిస్టర్ అంటాడు. నాకు హెల్ప్ కావలన్నప్పుడు తప్పక అడుగుతానని రుద్రాణి చెప్పి వెళ్తుంది. రుద్రాణిని తులసి చూస్తుంది.

ఏవండి ఆవిడ మన ఇంటికి తరచు వస్తుంది.. ఎందుకని తన భర్తని అడుగుతుంది. మనం ఈ రోజు హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం ఆవిడే అని మినిస్టర్ అనగానే అంతగా ఏం చేసిందని తులసి అనగానే తర్వాత చెప్తానని మినిస్టర్ కవర్ చేస్తాడు. మరొకవైపు కావ్య దగ్గరికి రాజ్ వచ్చి.. మనపై పగతో బిడ్డని ఎందుకు మారుస్తారు. బిడ్డని దూరం చేస్తారు కానీ నువ్వు అవేం ఆలోచించకుండా బిడ్డని ఒప్పుకోమని రాజ్ రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత బిడ్డని పట్టుకొని కావ్య దేవుడికి మొక్కుతూ బాధపడుతుంది. నా బిడ్డని కనిపెట్టే దారి చూపించు దేవుడా అని కావ్య ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.