Read more!

English | Telugu

మా అమ్మ ఎప్పుడూ ఆ సీరియల్స్ చూస్తూనే ఉంటుంది!

జీ తెలుగు మహోత్సవం 2023 ఈవెంట్ ప్రోమోస్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. ఈ షోకి సంబంధించి ఒక లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ మహోత్సవానికి  బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ నుంచి ఎంతో మంది నటీనటులు వచ్చారు. ఇక "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" మూవీతో ఒక సెన్సేషన్ సృష్టించిన నవీన్ పోలిశెట్టి వచ్చి మస్త్ డాన్స్ చేసాడు. "అమ్మా నాకు ప్రాబ్లమ్ ఉంది అని చెప్తే చక్కగా కూర్చుని జీ తెలుగు సీరియల్స్ చూసుకుంటూ కూర్చుంటుంది. అమ్మా కాలికి దెబ్బ తగిలింది అని చెప్తే ఏ ఆగు అక్కడ సీరియల్ అతనికి యాక్సిడెంట్ అయ్యింది " అని బాధపడుతూ ఉంటుంది అని వాళ్ళ అమ్మ జీ తెలుగు సీరియల్స్ ని ఎంత కాన్సంట్రేషన్ తో చెప్తుందో చెప్పాడు నవీన్. తరువాత  "కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అన్నాను..కానీ కొంచెమే కదా అని మీరు టచ్ లో లేరు" అని ప్రదీప్ అనడంతో "నువ్వు నీ షోలో ఎప్పుడూ పిలవలేదుగా నన్ను...ఒక నాలుగు హిట్ లు పడితే అప్పుడు చూద్దాం అని చెప్పి ఇప్పుడు ఇలా ప్లేట్ మార్చేసావా" అన్నాడు ఫన్నీగా నవీన్ .

"మా కొత్త సినిమా మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి..ఇది విన్నాక మన ఇంటి పేరు నాశనం చేస్తున్నాడన్న ఫీలింగ్ లో ఉన్నారు ఇంట్లో వాళ్ళు. ఫైనల్ గా పోస్టర్ మీద ఇంటి పేరు చూసేసరికి ఇంట్లో వాళ్లంతా రివర్స్ ఇపోయారు. ఈ సినిమా కథ విన్నాక చాలా ఎక్సయిట్ అయ్యాను. హీరోయిన్ ఎవరు అనేసరికి అనుష్క అన్నారు. విన్నవెంటనే నేను ఒక టు మినిట్స్ రూమ్ లోకి వెళ్లి డాన్స్ వేసుకున్నా. అదిరిపోయింది" అన్నాడు నవీన్ పోలిశెట్టి. నవీన్ జాతిరత్నాలు మూవీతో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. వెరైటీ కాన్సెప్ట్స్ ని ఎంచుకుంటూ మంచి మంచి మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నాడు.