Read more!

English | Telugu

అమ్మ మాటని కాదని రామలక్ష్మిని సీతాకాంత్ పెళ్ళి చేసుకోగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -48 లో.. ఎలాగైనా సీత సిచువేషన్ చూస్తుంటే కచ్చితంగా సిరి కోసం అయిన రామలక్ష్మిని పెళ్లి చేసుకునేలా ఉన్నాడు అలా జరగకూడదు.. వాడు ఎప్పుడు పెళ్లి కాకుండానే ఉండాలి. వాడు పెళ్లి చేసుకుంటేనా సామ్రాజ్యం కూలిపోతుందని శ్రీలత అంటుంది. అన్నయ్య పెళ్లి చేసుకుంటే వచ్చిన ప్రాబ్లమేంటి? సామ్రాజ్యం ఎందుకు కూలిపోతుందని సందీప్ అడుగుతాడు. అది నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. తర్వాత చెప్తానని శ్రీలత అంటుంది.

ఆ తర్వాత ఎలాగైనా ధన, సిరిల పెళ్లి జరగకూడదు.. సీతాకాంత్ పెళ్లి చేసుకోకూడదు. సిరికి నా ఫ్రెండ్ కొడుకుతో పెళ్లి చేస్తానని శ్రీలత నిర్ణయం తీసుకుంటుంది. మరుసటి రోజు శ్రీలత తన ఫ్రెండ్ ఫ్యామిలీని ఇంటికి పిలుస్తుంది. మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టుకుందామని శ్రీలత ఫ్రెండ్ అంటుండగా.. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఏం జరుగుతుందని సీతాకాంత్ అడుగుతాడు. దాంతో అందరిముందు బాగోదని సీతాకాంత్ ని శ్రీలత పక్కకి తీసుకొని వెళ్లి.. నువ్వు సైలెంట్ గా ఉండు సిరికి పెళ్లి ఫిక్స్ చేసానని శ్రీలత చెప్తుంది. అవసరం లేదు అంటు ఆల్రెడీ సిరి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఆ విషయం తెలియక మా అమ్మ మిమ్మల్ని పిలిచింది వెళ్లిపోండి అని సీతాకాంత్ అంటాడు. నా మాటకి ఎందుకు ఎదరు తిరుగుతున్నావని సీతాకాంత్ పై శ్రీలత కోప్పడుతుంది.

నా కూతురికి మంచి జీవితం ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నానని శ్రీలత అనగా.. నేను సిరికి హ్యాపీ లైఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నానని సీతాకాంత్ అంటాడు. నా మాట లెక్క చేయనప్పుడు నన్ను అమ్మ అని పిలిచే అర్హత నీకు లేదని శ్రీలత కోపంగా అనేసి వెళ్తుంది. ఆ తర్వాత శ్రీలత అన్న మాటలకి సీతాకాంత్ బాధపడుతుంటే‌‌.. వాళ్ళ తాతయ్య వస్తాడు. నువు రామలక్ష్మిని పెళ్లి చేసుకోమని అంటున్నావ్.. మాణిక్యం మీ పెళ్లి జరిగితేనే వాళ్ళ పెళ్లి చేస్తానని అంటున్నాడు.. ఇటు సిరిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని అమ్మ అంటుందని సీతాకాంత్ అంటాడు. నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకో తను నీ మనసులో ఉందని వాళ్ళ తాతయ్య చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.