English | Telugu

Bigg Boss 9 Telugu 10th week:  బీబీ రాజ్యంలో కంటెస్టెంట్స్.. రాజు, రాణులు, ప్రజలు ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం పది మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. ‌ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లు జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.

ఈ వారం కంటెస్టెంట్స్ అందరిని డివైడ్ చేసి.. బిబి రాజ్యంగా చేశాడు బిగ్ బాస్. రీతూ, కళ్యాణ్, దివ్య ఈ వారానికి బీబీ రాజ్యానికి రాజు, రాణులు.. వీళ్లకి ఈ ఇంట్లో ప్రత్యేకమైన విలాసాలు లభిస్తాయి.. వీరికి బెడ్‌రూమ్‌‌లో నివసించే హక్కు ఉంది.. అలాగే పూర్తి ఇంటికి యాక్సెస్ కూడా లభిస్తుందంటూ చాలానే వరాలు ఇచ్చాడు బిగ్‌బాస్. ఇక మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే వీళ్లకి ఇమ్యూనిటీ గెలుచుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా అని వీళ్లు సేఫ్ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్లని ఓడించి ఆ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి మిగతావారికి కూడా అవకాశం లభించనుంది.. ఇలా వారం ముగిసేసరికి అందరిలో ఒక్కరే ఇమ్యూనిటీ పొందుతారు.. ఆ ఒక్కరే ఈ ఇంటి కెప్టెన్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక రాజు, రాణులు కలిసి ఇంటి సభ్యులందరిని నలుగురు కమాండర్స్‌గా అలానే నలుగురు ప్రజలుగా విభజించాలని బిగ్‌బాస్ చెప్పాడు. కమాండర్స్‌కి కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వారికి కూడా ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంది. ఇక ప్రజలకి ఎలాంటి అవకాశం లేదు.. అలానే ఇంటి పని అంతా వాళ్లే చేయాల్సి ఉంటుంది. ఇక పవర్ రాగానే దివ్య-రీతూ మాములు ఎక్స్‌ట్రాలు చేయలేదు. ఒక్కొక్కరిని పిలిచి ఇంటర్వ్యూలు చేసినట్లుగా కొశ్చన్స్ అడిగారు. చివరికి కమాండర్లుగా నిఖిల్, సంజన, తనూజ, డీమాన్‌లని సెలెక్ట్ చేశారు. దీంతో కమాండర్స్ ఇప్పటినుంచి రోజ్ రూమ్‌లో ఉంటారు.. ప్రజలు మాత్రం బయట డెన్‌లో ఉండాలని బిగ్‌బాస్ చెప్పాడు. అలానే రాజు, రాణులు, కమాండర్స్ ఇంట్లో ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. పూర్తి పనులన్నీ ప్రజలు అయిన భరణి , ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, గౌరవ్ మాత్రమే చేయాలని బిగ్ బాస్ చెప్పాడు.

కాసేపటి తర్వాత భరణిని పిలిపించుకొని హెడ్ మసాజ్ చేయించుకుంది దివ్య. నాకు కొంచెం తలకాయ నొప్పిగా ఉంది భరణి గారిని పిలిచి హెడ్ మసాజ్ చేయించండి అంటూ డీమాన్‌కి దివ్య ఆర్డర్ వేసింది. దీంతో భరణిని పిలిపించి హెడ్ మసాజ్ చేయించాడు డీమాన్. అక్కడ కాసేపు సరదాగా సాగింది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.