ఎందుకు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావ్...పవిత్రపై ఆషిక ఎమోషనల్ పోస్ట్
బుల్లితెర నటి పవిత్ర జయరామ్ రీసెంట్ గా కారు యాక్సిడెంట్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. జీ తెలుగులో ప్రసారమయ్యే 'త్రినయని' సీరియల్ లో తిలోత్తమ రోల్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది పవిత్ర. ఆమె ఇక తిరిగి రాదనే వాస్తవం నుంచి, ఆ బాధ నుంచి ఆమె అభిమానులు, తోటి నటీనటుల్ని ఇంకా బయటకు రాలేదు. ఆమె మృతి విషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు త్రినయని సీరియల్ టీమ్. ఎందుకంటే త్రినయనిలో హీరోయిన్ కంటే కూడా తిలోత్తమ రోల్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇక ఈ సీరియల్ హీరోయిన్ ఆషికా పదుకొణె బాధపడుతూ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఆమెతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆ వీడియోస్ ని పిక్స్ ని అన్నీ కలిపి ఒక పోస్ట్ గా పెట్టుకుంది.