ముగిసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ...విన్నర్ గా నిలిచిన సౌజన్య
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఐకానిక్ ఫినాలేలో ధూమ్ ధామ్ గా జరిగింది. ఒక్కొక్కరి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది అని చెప్పొచ్చు. దాదాపు 12 మంది ఈ పోటీకి అర్హత సాధించగా ఫైనల్ కి ఐదుగురు వచ్చారు. న్యూ జెర్సీకి చెందిన డాక్టర్ శ్రుతి, హైదరాబాద్ నుంచి జయరాం, కార్తీక్, సిద్ధిపేట నుంచి లాస్య ప్రియ, విశాఖపట్నం నుంచి సౌజన్య భాగవతుల ఫైనల్స్ కి వచ్చారు. ఫైనల్ ఎపిసోడ్ లో టైటిల్ విన్నర్ గా సౌజన్య ట్రోఫీని సొంతం చేసుకుంది. ట్రోఫీని అల్లు అర్జున్, గీతామాధురి, కార్తీక్, థమన్ అందించారు. "సౌజన్య నీకు ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన పేరెంట్స్ మనకు ఎలాగో సపోర్ట్ చేస్తారు. కానీ భర్త, అత్తగారు, మావగారు సపోర్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నువ్వు ఇప్పుడు చాల మందికి ఇన్స్పిరేషన్ వి అవుతావు" అని చెప్పారు అల్లు అర్జున్. అలాగే 10 లక్షల చెక్కుని కూడా అందించారు.