English | Telugu

కేడీ బ్యాచ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -789 లో..మహేంద్ర ఫ్రెండ్ మహేంద్ర ఇంటికి వచ్చి వసుధార అడ్రెస్ తెలిసిందని చెప్తాడు. వసుధార వరంగల్ లోని విష్ కాలేజీ లో లెక్చరర్ గా చేస్తుందని మహేంద్ర ఫ్రెండ్ అంటాడు.  నేను వసుధార దగ్గరికి వెళ్లి రిషి ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటాను. అసలు రిషిని కాలేజీ నుండి బయటకు పంపించడానికి గల కారణం తెలుసుకుంటానని మహేంద్ర అంటాడు. నేను కూడా మీతో వస్తానని జగతి అడుగుతుంది. దీనికంతటికి కారణం నువ్వే.. నువ్వు రావొద్దని మహేంద్ర చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

స్వప్నని వెతికే పనిలో రాజ్, కావ్య.. కనకంపై రుద్రాణి ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -122 లో.. మా అక్కని తీసుకొస్తానంటూ బయటకు వెళ్తుంది కావ్య. రాజ్ నువ్వు కూడా కావ్యకి తోడుగా వెళ్ళమని సీతరామయ్య చెప్పగానే.. రాజ్ వెళ్తాడు. రాజ్ బయటకు వచ్చి మీ అక్క ఇలా ఎందుకు చేసిందని కావ్యని అడుగుతాడు. మీ వల్ల మా ఇంటి పరువు ఏమవుతుందని కావ్యతో రాజ్ అంటాడు. ఇంట్లో వాళ్ళకి మాత్రమే ఈ పెళ్లి జరుగుతున్నట్లు తెలుసు. బయటవారు వచ్చే అవకాశం లేదని కావ్య అనగానే.. అంటే ఈ ఇంట్లో వాళ్ళలో ఒక్కడైన రాహులే ఈ పని చేసాడని నువ్వు అంటున్నావా? ఎప్పుడు వాడిమీదకే ఎందుకు నీ ఆలోచన అని కావ్యని రాజ్ అంటాడు.

 టైం వస్తే ప్రొపోజ్ చేస్తా అన్న కావ్య...

"నీతోనే డాన్స్" గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఇందులో రీల్ అండ్ రియల్ కపుల్స్ వచ్చి మస్త్ పెర్ఫార్మెన్సెస్ చేశారు. నిఖిల్-కావ్య జోడి డాన్స్ మంచి కలర్ ఫుల్ గా సాగింది. జడ్జెస్ కూడా వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ ని బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత "కావ్యలో మీకు నచ్చేది ఏమిటి" అని శ్రీముఖి నిఖిల్ ని అడిగేసరికి " ఆమె కళ్ళు, నవ్వు" అని చెప్పాడు..అదే ప్రశ్నను కావ్యాన్ని కూడా అడిగింది. "నిఖిల్ హైట్, తన జోవియల్ నేచర్ అంటే ఇష్టం" అని చెప్పింది కావ్య. "ఇన్ని ఇష్టపడే క్వాలిటీస్ ఉన్నప్పుడు ఇంకా కపుల్ ఎందుకు కాలేదు" అని శ్రీముఖి అడిగింది "టైం రావాలి కదా" అని చెప్పింది కావ్య.

వసుధార ఇచ్చిన లెటర్ ని చింపేసిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -788 లో.. వసుధారని ఎందుకు కాల్ చేసావని మహేంద్ర అడుగుతాడు. వసుధార తడబడుతూ.. రిషి సర్ గురించి ఏమైనా తెలిసిందేమోనని కాల్ చేసానని అనగానే.. మీరు ఇద్దరు రిషిని మోసగాడిలాగా ముద్రవేశారు కదా.. వాడు ఎందుకు వస్తాడని  మహేంద్ర కోప్పడుతాడు. ఆ తర్వాత మహేంద్ర ఫోన్ కట్ చేయగానే.. ఏమైంది మహేంద్ర వసుధార ఎందుకు కాల్ చేసిందని జగతి అడుగుతుంది. జగతితో మహేంద్ర మాట్లాడకుండా.. ధరణిని పిలుస్తాడు. ఇన్ని రోజులు కాల్ చెయ్యని వసుధార ఈ రోజు చేసింది.. తనకి రిషి గురించి తెలుసేమోనని అనిపిస్తుంది. అందుకే వసుధార ఎక్కడ ఉందో తెలుసుకొని రిషి గురించి తెలుసుకుంటానని మహేంద్ర అంటాడు.