అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ భారీ మల్టీస్టారర్ 'బడే మియా చోటే మియా' ఏప్రిల్ 11న విడుదల
పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం 'బడే మియా చోటే మియా'. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రాబోతోంది. బడే మియా చోటే మియా చిత్రం కోసం ఇప్పటికే యాక్షన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ అవతారంలో కనిపిస్తున్నారు.