English | Telugu

"భట్టివిక్రమార్క" రీమేక్ చేయటం లేదు - సాయిబాబా

"భట్టివిక్రమార్క" రీమేక్ చేయటం లేదు అని సాయిబాబు అన్నారు. వివరాల్లోకి వెళితే యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీరామచంద్రుడిగా, నయనతార సీతాదేవిగా, బాపు గారి దర్శకత్వంలో "శ్రీరామరాజ్యం" అనే భక్తిరస చిత్రాన్ని నిర్మించిన చక్కని అభిరుచి ఉన్న నిర్మాత యలమంచిలి సాయిబాబా. ఈ నిర్మాత సాయిబాబు గతంలో నటరత్న యన్.టి.ఆర్., కాంతారావు, అంజలీ దేవి యస్.వి.రంగారావు, రేలంగి, నాగభూషణం తదితరులు నటించగా బ్లాక్ బస్టర్ హిట్టయిన "భట్టివిక్రమార్క" చిత్రాన్ని యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రీమేక్ చేయనున్నారనే వార్త ఈ మధ్య సినీ వర్గాల్లో బాగా ప్రాచుర్యం పోందింది. అయితే అది నిజం కాదనీ తాను "భట్టివిక్రమార్క" చిత్రాన్ని రీమేక్ చేయటం లేదనీ సాయిబాబా మీడియాకు తెలియజేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.