English | Telugu

ప్రముఖ రచయిత లల్లాదేవి కన్నుమూత.. సౌందర్య 100వ సినిమా కథ ఆయనదే!

ప్రముఖ కథ, నవలా రచయిత లల్లాదేవి కన్నుమూశారు. ఆయన అసలు పేరు పరుచూరి నారాయణాచార్యులు. లల్లాదేవి పేరుతో రచనలు చేశారు. పదుల సంఖ్యలో కథలు, నవలలు, నాటకాలు రచించి గొప్ప రచయితల్లో ఒకరిగా పేరుపొందారు. 82 సంవత్సరాల వయసులో నేడు(అక్టోబర్ 3న) ఆయన మరణించారు.

లల్లాదేవి 30కి పైగా కథలు, 50కి పైగా నవలలు రచించారు. ఆయన నవలలు సినిమాలుగానూ వచ్చాయి. అప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య 100వ సినిమా 'శ్వేతనాగు'కి ఆయనే రచయిత కావడం విశేషం. 2004లో విడుదలైన ఈ సినిమాకి సంజీవి దర్శకత్వం వహించగా, సి.వి. రెడ్డి నిర్మించారు.

లల్లాదేవి నవలలు చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి:

లల్లాదేవి నవలలు

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.