English | Telugu

ప్రముఖ సినీ రచయిత గణేష్‌పాత్రో కన్నుమూత

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రముఖ సినీ రచయిత గణేష్‌పాత్రో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 69. గణేష్‌పాత్రో తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మాటల రచయిత గా పనిచేశారు. రీసెంట్ గా వచ్చిన వెంకటేష్, మహేష్ బాబుల మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు కూడా ఆయన మాటలను అందించారు. నిర్ణయం, సీతారామయ్య గారి మనువరాలు, రుద్రవీణ, మా పల్లెల్లో గోపాలుడు, ప్రేమించు పెళ్లాడు, మయూరి, మనిషికో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, మరో చరిత్ర, అత్తవారిల్లు లాంటి అనేక సినిమాలకు గణేష్ పాత్రో మాటల రచయిత. ఆయనకు రెండుసార్లు నంది అవార్డులు వరించాయి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.