English | Telugu

చ‌క్రి మ‌ర‌ణం ముందురోజు ఏం జ‌రిగింది?

చ‌క్రి మ‌ర‌ణం ప‌రిశ్ర‌మ‌ని, అత‌ని స్నేహితుల్ని షాక్‌కి గురిచేసింది. అంత వ‌ర‌కూ క‌ళ్ల ముందు క‌నిపించిన మ‌నిషిని నిర్జీవంగా చూసేస‌రికి త‌ట్టుకోలేక‌పోయారు. అయితే చ‌క్రి మ‌ర‌ణించిన ముందు రోజు ఏం జ‌రిగింది?? త‌ను ఎక్క‌డున్నాడు?? ఈ విష‌యాలు అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపాయి. వీటిపై చ‌క్రి భార్య శ్రావ‌ణి స‌మాధాన‌మిచ్చింది. చ‌క్రి ముందు రోజు రాత్రి ఏడింటి వ‌ర‌కూ ఇంట్లోనే ఉన్నాడ‌ట‌. ఆ త‌ర‌వాత రికార్డింగ్ థియేట‌ర్‌కి వెళ్లిపోయాడు. ఎప్పుడో అర్థరాత్రి వ‌చ్చి రెండింటి వ‌ర‌కూ టీవీ చూసి.. ప‌డుకొన్నాడు. తెల్ల‌వారుఝామున మాత్ర వేసుకోవ‌డం శ్రావ‌ణికి అల‌వాటు. మాత్ర వేసుకోవ‌డానికి య‌ధావిధిగా లేచింది. అయితే.. ఏమాత్రం చ‌ల‌నం లేకుండా ప‌డుకొని ఉన్న‌చ‌క్రినిచూస్తే అనుమానం వేసిందామెకు. ఎందుకంటే చ‌క్రి కి గుర‌క‌పెట్టే అల‌వాటు ఉంది. కానీ ఆ శ‌బ్దం కూడా వినిపించ‌డం లేదు. ప‌రీక్ష‌గా చూస్తే అప్ప‌టికే శ‌రీరం రంగు మారిపోయింద‌ట‌. శ్వాస కూడా తీసుకోవ‌డంలేదు. వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకెళ్తే.. అప్ప‌టికే చ‌క్రి మ‌ర‌ణించాడ‌ని డాక్ట‌ర్లు ధృవీక‌రించేశారు. అలా చ‌క్రి ప్రాణం త‌న సొంత ఇంట్లోనే పోయింద‌న్న‌మాట‌. ఈ విష‌యాల‌న్నీ శ్రావ‌ణి వెల్ల‌డించింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.