English | Telugu

వార్ 2 రికార్డు కలెక్షన్స్.. ట్రెండ్ మారుతుందా!

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr),స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan)కలిసి సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసిన మూవీ 'వార్ 2'(War 2). 2019 లో విడుదలైన 'వార్' కి సీక్వెల్ గా తెరకెక్కిన వార్ 2 , వార్ ని మించి విజయాన్ని అందుకుందని చిత్ర బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఎన్టీఆర్, హృతిక్, కియారా అద్వానీ(Kiara Advani)ల హైఎనర్జీ పెర్ఫార్మెన్స్, అయాన్ ముఖర్జీ(Ayan Mukerji)దర్శకత్వ ప్రతిభ, యష్ రాజ్(Yash Raj)నిర్మాణపు విలువల్లోని భారీ తనం 'వార్ 2 ' ని అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెప్పు పొందేలా చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

వరల్డ్ వైడ్ గా 'వార్ 2 ' మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని చూసుకుంటే హిందీలో 30 కోట్ల రూపాయలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, రెస్టాఫ్ ఇండియా కలుపుకొని 5 కోట్లు, ఓవర్సీస్‌లో 25 కోట్లు, ఇలా వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. రెండవరోజు చూసుకుంటే హిందీలో 25 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా 5 కోట్లు ఓవర్సీస్‌లో 15 కోట్లు చొప్పున, వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తుంది. దీంతో టోటల్ గా రెండు రోజుల్లో 155 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టుగా సినీ సర్కిల్స్ లో టాక్.

మౌత్ టాక్ పరంగా తొలి రోజు కొంచం మిక్స్డ్ టాక్ నడిచినప్పటకి 'వార్ 2 ' బాగుందనే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. ఎన్టీఆర్ మానియాతో తెలుగులో వార్ 2 మరిన్ని రికార్డు కలెక్షన్స్ సాధిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. సుమారు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో వార్ 2 తెరకెక్కింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.