English | Telugu

కూలీ రికార్డు కలెక్షన్స్.. ఆ సినిమా రికార్డు గల్లంతు 

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth),కింగ్ నాగార్జున(Nagarjuna), లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)ల ప్రెస్టేజియస్ట్ మూవీ 'కూలీ'(Coolie)ఈ నెల 14 న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. 'దేవ'గా సెల్యులాయిడ్ పై రజనీ మరోమారు తన స్టైల్ తో మెప్పించడం, సైమన్ గా నాగార్జున నెగిటివ్ రోల్ లో, తన సత్తా చాటడంతో ప్రేక్షకులతో థియేటర్స్ నిండిపోతున్నాయి. స్టార్ హీరోలు అమీర్ ఖాన్(Aamir Khan),ఉపేంద్ర(Upendra)అతిధి పాత్రల్లో మెప్పించడం కూడా 'కూలీ'కి ప్లస్ అయ్యిందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

కూలీ తొలి రోజు కలెక్షన్స్ ని చూసుకుంటే తమిళనాడులో 30 కోట్ల రూపాయలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు, కేరళలో 9 కోట్లు, కర్ణాటక 11 కోట్లు, హిందీ, రెస్టాఫ్ ఇండియా కలుపుకొని 7 కోట్లు, ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో 74 కోట్లు, ఇలా వరల్డ్ వైడ్ గా 151 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టింది. ఈ మేరకు హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన ఫస్ట్ తమిళ మూవీ 'కూలీ' నే అని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఇళయ దళపతి విజయ్ మూవీ లియో పేరు పై ఉండేది. ఆ మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా 146 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. దీంతో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద తనకున్న మానియా ని రజనీ మరో సారి చాటిచెప్పినట్టయింది.

రెండో రోజు చూసుకుంటే తమిళనాడులో 25 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు, కర్ణాటక, కేరళ, హిందీ, రెస్టాఫ్ ఇండియా కలుపుకొని 5 కోట్లు, ఓవర్సీస్‌లో 20 కోట్లు చొప్పున వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా,ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో కూలీ రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 221 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టిందనే వార్తలు వినపడుతున్నాయి. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.



ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.