English | Telugu

సీరియ‌ల్ చేద్దామ‌న్న క‌మ‌ల్‌... నో చెప్పిన విక్ర‌మ్‌!

పొన్నియిన్ సెల్వ‌న్ సినిమా ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ మూవీ. ఆల్రెడీ పొన్నియిన్ సెల్వ‌న్ ఒన్‌కి విశేష‌మైన స్పంద‌న వ‌చ్చింది. 500 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఇప్పుడు దాన్నే ప్రైమ‌రీ అమౌంట్‌గా ఫిక్స్ అయి థియేట్రిక‌ల్ క‌లెక్ష‌న్ల‌ను టార్గెట్ చేస్తోంది టీమ్‌. పొన్నియిన్ సెల్వ‌న్ టీమ్ ఇప్పుడు దేశ‌మంతటా ప‌లు న‌గ‌రాల్లో జోరుగా ప్ర‌మోష‌న్లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ క‌థ‌కు సంబంధించి ర‌క‌ర‌కాల విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. బాహుబ‌లి సినిమాను చూసిన త‌ర్వాతే పొన్నియిన్ సెల్వ‌న్‌ను తెర‌కెక్కించే ధైర్యం వ‌చ్చింద‌ని చెప్పారు మ‌ణిర‌త్నం. విక్ర‌మ్ ఓ ఇంట‌ర్వ్యూలో ఇంట్ర‌స్టింగ్ విష‌యాల‌ను చెప్పారు. ``చాన్నాళ్ల క్రితం ఓ సారి క‌మ‌ల్ సార్ న‌న్ను క‌లిశారు. ఆయ‌న ఆఫీస్‌కి పిలిస్తే వెళ్లా. పొన్నియిన్ సెల్వ‌న్ క‌థ గురించి చెప్పారు. ఆ ప్రాజెక్ట్ ని తానే టేక‌ప్ చేస్తాన‌ని అన్నారు. అందులో ఓ పాత్ర‌లో న‌న్ను న‌టించ‌మ‌ని అడిగారు. `ఏ కేర‌క్ట‌ర్ కావాలో ఎంపిక చేసుకో`మ‌ని అన్నారు. నేను అందుకు `ఇలా క‌థ‌గా విన‌డం క‌న్నా, పొన్నియిన్ సెల్వ‌న్ న‌వ‌ల చ‌దివి మిమ్మ‌ల్ని క‌లుస్తాను` అని చెప్పి అక్క‌డి నుంచి వ‌చ్చేశాను. ఇంటికి వ‌చ్చాక మ‌ళ్లీ ఫోన్ చేశారు. `పొన్నియిన్ సెల్వ‌న్ సినిమా కాదు. సీరియ‌ల్ చేస్తాను. టీవీలో ప్ర‌ద‌ర్శిద్దాం` అని అన్నారు. తాను అందులో న‌టించ‌న‌ని కూడా స్ప‌ష్టంగా చెప్పారు.

నేను ఆలోచించాను. సీరియ‌ల్‌గా చేయ‌డం క‌న్నా, సినిమాగా చేస్తేనే బావుంటుంద‌నిపించింది. `ఈ క‌థ వెండితెర‌కు వెళ్లేదాకా నేను వెయిట్ చేస్తాను. ఇప్పుడు సీరియ‌ల్‌లో వ‌ద్దు` అని ఆయ‌న‌తో చెప్పాను. నిజంగానే ఈ న‌వ‌ల‌కు వెండితెర‌మీద రూపం ఇవ్వాల‌నుకున్న‌ప్పుడు మ‌ణిర‌త్నం న‌న్ను అప్రోచ్ అయ్యారు. అప్పుడు క‌మ‌ల్‌హాస‌న్ మన‌సులో ఈ క‌థ‌కు రూపం ఇవ్వాల‌నుకున్న‌ప్పుడూ నేనున్నాను. ఇప్పుడు మ‌ణిర‌త్నం ఆలోచ‌న‌ల్లోనూ నేనున్నారు. పొన్నియిన్ సెల్వ‌న్ క‌థ ఎవ‌ర‌నుకున్నా స‌రే, న‌న్ను అప్రోచ్ అయినందుకు ఆనందంగా ఉంది`` అని అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.