English | Telugu

కళ్ళ ముందు కనపడుతుంది.. వార్ 2026 తప్పదా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan),ఇళయదళపతి విజయ్(Ilayathalapathy VIjay).ఈ ఇద్దరు తమకున్న సినీ బ్యాక్ గ్రౌండ్ తోనే హీరోలుగా పరిచయమయ్యారు. కానీ తమదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, మేనరిజమ్స్, డాన్స్ లతో లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్నారు. ఎంతలా అంటే సొంతంగా రాజకీయపార్టీ స్థాపించేంతలా. ఈ ఇద్దరు తెలుగు, తమిళ సినీ రంగానికి చెందిన వారే అయినా, రెండు దశాబ్డలపై నుంచే సినిమాల పరంగా ఇద్దరి మధ్య మంచి అనుబందం ఉంది. విజయ్ తమిళంలో చేసిన 'ఖుషి', 'తిరుపాచి' వంటి సినిమాలని, పవన్ తెలుగులో రీమేక్ చేసి మంచి విజయాల్ని అందుకున్నాడు. ముఖ్యంగా పవన్ కెరీర్ లో 'ఖుషి' ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. పవన్, విజయ్ గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతు,ఒకరంటే ఒకరికి అభిమానమని చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఈ ఇద్దరు రాజకీయరంగంలో ప్రత్యర్థులుగా మారబోతున్నారే వార్తలు తెలుగు, తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

రీసెంట్ గా విజయ్ తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కజగం'(Tvk)కి సంబంధించిన సభని మదురైలో నిర్వహించడం జరిగింది. అందులో విజయ్ మాట్లాడుతు 'బీజెపి పార్టీ ఐడియాలజీకి నేను వ్యతిరేకం. బీజెపితో పొత్తు ఎప్పటికి ఉండదు. మోడీ(Narendra Modi)తమిళనాడుతో పాటు, తమిళనాడు లో ఉన్న ముస్లిమ్స్ పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఈ మాటలే పవన్ కళ్యాణ్, విజయ్ రాజకీయ యవనికపై ప్రత్యర్థులుగా మారే అవకాశమున్నట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. పవన్ రాజకీయపరంగా బిజెపి తో పొత్తులో ఉన్నాడు. అందులో భాగంగా ఎలక్షన్స్ జరుగుతున్న ప్రతి స్టేట్ కి బిజెపి తరుపున స్టార్ క్యాంపైనర్ గా వెళ్లి ప్రచారం చేస్తున్నాడు.

ఇటీవల తమిళనాడుకి చెందిన బిజెపి నాయకులు పవన్ తో పలు ధపాలుగా తమిళనాడులో బహిరంగ సభలని ఏర్పాటు చేసారు. ఆయా సభల్లో పవన్ స్పీచ్ తమిళనాడు బిజెపీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే మధ్య జరిగే తమిళనాడు సార్వ్రతిక ఎన్నికల్లో బిజెపి(Bjp)తరుపున పవన్ ప్రచారం గ్యారంటీ. పైగా మోడీ అంటే పవన్ కి వ్యక్తిగతంగా చాలా ఇష్టం. మోడీ లాంటి నాయకుడు దేశానికీ చాలా అవసరమని చెప్తూనే ఉన్నాడు. మరి విజయ్ తన మాటల్లో మోడీ, బీజెపి కి వ్యతిరేకమని స్పష్టంగా చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వార్ తప్పేలా లేదని సినీ, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.