English | Telugu
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ
Updated : Sep 14, 2023
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సూపర్హిట్ అయింది. ఈ నేపథ్యంలో జరిగిన ఓ ఫంక్షన్లో విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ తనకు సక్సెస్ని అందించిన అభిమానుల కుటుంబాలకు కూడా సంతోషాన్ని పంచాలనుకుంటున్నానని, అందుకోసం 100 ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేసి ఒక్కో ఫ్యామిలీకి రూ.1లక్ష అందిస్తానని ప్రకటించాడు. దాని కోసం అప్లికేషన్లు పంపించాల్సిందిగా కోరాడు. ఎన్నో అప్లికేషన్లు వచ్చాయి. అందులో నుంచి 100 ఫామిలీస్ని సెలెక్ట్ చేశారు.
తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ గురువారం దానికి సంబంధించి అఫీషియల్గా 100 మంది లిస్ట్ను ప్రకటించాడు. ఈ లిస్ట్లో తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీసే కాకుండా కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారు కూడా ఉన్నారు. త్వరలోనే హైదరాబాద్లో జరిగే ఖుషి గ్రాండ్ ఈవెంట్లో 100 కుటుంబాలకు చెక్కులు అందిస్తారు.
దీని గురించి హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ ‘ఖుషి హ్యాపీనెస్ షేర్ చేసుకునేందుకు ఈ వంద మంది ఫ్యామిలీస్ను ఎంపిక చేశాం. ఈ లిస్టులో పేరున్న కుటుంబాలు ఎంతో ఆనందిస్తాయని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.