English | Telugu

'విరాట పర్వం' దర్శకుడితో ధనుష్ మూవీ!

కోలీవుడ్ స్టార్ ధనుష్ దృష్టి టాలీవుడ్ దర్శకుల మీద పడింది. ఇటీవల వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ చేసిన 'సార్' మూవీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.120 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా ధనుష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయనున్నారు ధనుష్. తాజాగా ఆయన మరో టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.

'నీదీ నాదీ ఒకే కథ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు ఊడుగుల మొదటి సినిమాతోనే ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన రెండో సినిమా 'విరాట పర్వం' కమర్షియల్ గా సక్సెస్ సాధించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడిగా ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చింది. అయితే 'విరాట పర్వం' విడుదలై ఏడాది అయినప్పటికీ, ఇంతవరకు వేణు తన కొత్త సినిమాని ప్రకటించలేదు. దర్శకుడిగా ఆయన మూడో సినిమా ఈ హీరోతోనే అంటూ నాగ చైతన్య, సూర్య వంటి హీరోల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు ధనుష్ తో ఆయన సినిమా ఓకే అయిందని బలంగా న్యూస్ వినిపిస్తోంది. వేణు చెప్పిన కథని ధనుష్ ఇంప్రెస్ అయ్యి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదొక పీరియాడిక్ ఫిల్మ్ అని.. తెలుగు, తమిళ భాషలలో మంచి బడ్జెట్ తో రూపొందనుందని తెలుస్తోంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.