English | Telugu

వెంకీ "షాడో" ప్రారంభం

వెంకీ "షాడో" ప్రారంభం అయ్యింది. వివరాల్లోకి వెళితే యునైటెడ్ మూవీస్ పతాకంపై, విక్టరీ వెంకటేష్‍ హీరోగా, తాప్సి సెకండ్ హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రం "షాడో". ఈ "షాడో" చిత్రం జనవరి 25 వ తేదీన, హైదరాబాద్ రామానాయుడు స్టుడియోలో ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ "షాడో" చిత్రంలో హీరో శ్రీకాంత్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

గతంలో "సంక్రాంతి" చిత్రంలో వెంకటేష్ కి తమ్ముడిగా శ్రీకాంత్ నటించారు. ఒకప్పుడు "షాడో" అన్న పేరు తెలుగు పాఠకులకు మధుబాబు రాసిన డిటెక్టీవ్ నవలల ద్వారా సుపరిచితమే. ఈ "షాడో చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి నెల నుండి ప్రారంభం కానుంది. తమన్ యస్.యస్. ఈ "షాడో" చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.