English | Telugu

‘బాహుబలి’కి విక్టరీ ప్రశంసలు

టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీగా రూపొందిన విజువల్ వండర్ ‘బాహుబలి’ చిత్రాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని హీరో విక్టరీ వెంకటేష్ వీక్షించారు. రాజమౌళి అండ్ టీమ్ కి అభినందనలు.

ప్రభాస్, రానా సహా ఇతర నటీనటులు, టెక్నిషియన్స్, విఎఫెక్స్ సహా వందల టెక్నిషియన్స్ ఈ సినిమాని విజువల్ వండర్ గా తీర్చిదిద్దడానికి కృషి చేశారు. వారందరూ ఇటువంటి సెల్యూలాయిడ్ ను క్రియేట్ చేసిందకు వారికి స్పెషల్ థాంక్స్.

ఇటువంటి చిత్రాన్నిరెండు సంవత్సరాల్లో విజువల్ ఎఫెక్స్ తో ఒక అద్భుత చిత్రంగా మలిచి ప్రపంచస్థాయిలో తెలుగు సినిమాకి గొప్ప పేరు తీసుకొచ్చారు. అంతర్జాతీయస్థాయి ప్రేక్షకులు సైతం ఈ సినిమాకి నీరాజనాలు పడుతున్నారు.

రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు కంగ్రాట్స్. ఈ కథపై నమ్మి హ్యుజ్ బడ్జెట్ తో నిర్మించారు. వారి ఎఫర్ట్, నమ్మకం తెలుగు సినిమా పొటెన్షియల్ ను చాటి చెప్పింది. రాజమౌళి, బాహుబలి చిత్రంతో ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేశాడు. ప్రతి తెలుగువాడు గర్వపడే సమయమిది అని వెంకటేష్ తెలియజేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.