English | Telugu

అలిపిలో వరుణ్ పూజా రొమాన్స్

"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. కొచ్చిన్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం అలిపిలో చిత్రీకరణ చేస్తున్నారు. ఇందులో వరుణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి "ఆరడుగుల బుల్లెట్టు", "గొల్లభామ" అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.