English | Telugu

యూనిటీ డాక్యుమెంటరీ ఫిల్మ్ ను ఆవిష్కరించిన సుద్దాల అశోక్ తేజ!

తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి గల్లీ నుంచి డిల్లీ వరకు పోరాటం చేసి తెలంగాణ బాపూజీగా గుర్తింపు తెచ్చుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీపై బడుగు విజయ్ కుమార్ దర్శకత్వంలో చిరందాసు ధనుంజయ నిర్మించిన యూనిటీ డాక్యుమెంటరీ ఫిల్మ్ ను ప్రఖ్యాత గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 27 కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని ప్రముఖ రచయిత మసన చెన్నప్ప తో కలిసి అశోక్ తేజ యూనిటీ డాక్యుమెంటరీ ఫిల్మ్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అశోక్ తేజ... బాపూజీ జీవన ప్రవాహాన్ని ఎంతో భావోద్వేగంగా చిత్రీకరించిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. యూనిటీ డాక్యుమెంట్రీ ఫిల్మ్ ను విడుదల చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్న సుద్దాల అశోక్ తేజ.. తెలంగాణ ధ్వజస్తంభాలను భావితరాలు గుర్తుంచుకునేలా యూనిటీ చిత్రం ఉందన్నారు. ఇటీవల 15వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ల్లో ఉత్తమ దర్శకుడి విభాగంలో పురస్కారం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రేక్షకులంతా ఉచితంగా యూట్యూబ్ లో యూనిటీ చిత్రాన్ని తప్పకుండా చూడాలని అశోక్ తేజ విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రంలో మాస్టర్ భాను, మైమ్ మధు కీలక పాత్రల్లో నటించారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.