English | Telugu

హిజ్రాగా నటించాలన్నది తన డ్రీమ్‌ అంటున్న టాలీవుడ్‌ హీరోయిన్‌!

నటీనటులన్న తర్వాత ఏ తరహా పాత్ర చెయ్యడానికైనా ముందుకు రావాలి. అలా అన్ని రకాల పాత్రలు పోషించినవారు ప్రతి ఇండస్ట్రీలోనూ ఉన్నారు. అయితే వాటిలో హిజ్రా క్యారెక్టర్‌ అనేది చెయ్యడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే చేయడం చిన్నతనంగా భావిస్తారు. ఇప్పటివరకు అలాంటి క్యారెక్టర్స్‌ చేసిన వారంతా నటులే. నటీమణులతో హిజ్రా క్యారెక్టర్‌ను ఎవరూ చేయించలేదు. కానీ, మన టాలీవుడ్‌ హీరోయిన్‌ శోభన మాత్రం ఆ క్యారెక్టర్‌ చెయ్యడం తన డ్రీమ్‌ అంటోంది. హిజ్రాగా నటించే అవకాశం వస్తే మాత్రం దాన్ని వదిలిపెట్టనని చెబుతోంది.

ఈ క్యారెక్టర్‌ విషయమై కొందరు దర్శకులతో కూడా మాట్లాడానని ఆమె చెబుతున్నారు. అయితే ఆ దర్శకులు తనతో అలాంటి క్యారెక్టర్‌ చేయించేందుకు సిద్ధంగా లేరని అన్నారు. డైరెక్టర్లే కాదు, ప్రేక్షకులు కూడా తనను అలా చూసేందుకు ఇష్టపడరేమో అనే సందేహాన్ని కూడా ఆమె వెలిబుచ్చారు. హిజ్రాగా నటించడం అనేది ఒక ఛాలెంజ్‌తో కూడుకున్నదని, తెరపై చూసినంత ఈజీ కాదని శోభన వివరించారు. హిజ్రా క్యారెక్టర్‌ తనతో చేయించేందుకు ఏ డైరెక్టర్‌ అయినా తనను అప్రోచ్‌ అయితే వెంటనే ఓకే చేస్తానని చెబుతున్నారు.

1980వ దశకంలో నటిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన శోభన గురించి ఇప్పటితరం ప్రేక్షకులకు అంతగా తెలీదు. అక్కినేని నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్‌’లో హీరోయిన్‌గా నటించారు శోభన. తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో 230 సినిమాల్లో నటించారు. తెలుగులో మువ్వగోపాలుడు, రుద్రనేత్ర, నారీ నారీ నడుమ మురారి, అల్లుడుగారు, ఏప్రిల్‌ 1 విడుదల, అప్పుల అప్పారావు, రౌడీగారి పెళ్లాం వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు శోభన. నటిగా ఎంత పేరు తెచ్చుకున్నారో, డాన్సర్‌గా అంతకు మించిన పేరు ప్రఖ్యాతులు సాధించారు. శోభన రెండుసార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే ఫిలింఫేర్‌తోపాటు అనేక అవార్డులు ఆమెను వరించాయి. సినీ రంగానికి, నాట్యరంగానికి చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలతో శోభనను సత్కరించింది. నటిగా, డాన్సర్‌గా అంతటి ఖ్యాతి సంపాదించుకున్న శోభన.. హిజ్రా తన డ్రీమ్‌ క్యారెక్టర్‌ అని చెప్పడం అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. మరి ఆమె డ్రీమ్‌ని నిజం చేసే డైరెక్టర్‌ ఎవరో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.