English | Telugu

‘పుష్ప 2’... ఏప్రిల్ 8 వరకు లేనట్టే!

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 దిరూల్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. పుష్ప మొదటి పార్ట్ పుష్పాది రైజ్ చిత్రంతో తన సత్తా చాటిన ఐకాన్ సార్ పుష్ప 2 ది రూల్ సినిమాతో మరో పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్లు ఈ చిత్రాన్ని మొదటి భాగంతో పోల్చితే రెండో భాగాన్ని గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. విశాఖపట్నంలో హీరో పరిచయ గీతాన్ని చిత్రీకరించారు. అభిమానులు ఆ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. టీజర్ ఎప్పుడు అని ఆరా తీస్తున్నారు.

అల్లు అర్జున్ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8 వరకు ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రాదని టాక్ వినిపిస్తోంది. బన్నీ పుట్టినరోజు నాడే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నారట. అప్పటివరకు ఫ్యాన్స్ ఓపిక పట్టాలి. పుష్ప 2 లో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర‌ను పోషిస్తున్నారు. ఆయ‌న‌తో పాటు మంగ‌ళం శ్రీ‌ను గా సునీల్‌, ద్రాక్షాయ‌ణి పాత్ర‌ధారి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ల‌తో పాటు జ‌గ‌ప‌తిబాబు కూడా ఓ విల‌న్ గా న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం. విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రత్యేక పాత్రలో రామ్ చరణ్ కూడా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం 250 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఈ మూవీ ని తెలుగు, తమిళ, మలయాళం, హిందీల‌ తో కలిపి మొత్తం పది భాషల్లో విడుదల చేయనున్నారు. ఇకపోతే రీసెంట్‌గా అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం... అదే పులి నాలుగు అడుగుల వెనక్కి వేసింది అంటే పుష్పరాజు వచ్చాడని అర్థం అనే డైలాగ్ సోషల్ మీడియాలో లీకై సినీ ప్రియుల చేత ఈల‌లు వేయించింది. మొత్తంగా 1000కోట్ల టార్గెట్‌లో ఈ పుష్ప 2 ది రూల్ చిత్రం రూపొందుతోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.