English | Telugu

బాహుబలి తో తమన్నాకు బంపరాఫర్లు

బాహుబలి బాలీవుడ్ లోనూ ఇరగదీస్తోంది. ఇప్పటివరకూ హిందీలో డబ్ అయిన ఏ చిత్రం చేరుకోని హైట్స్ కు చేరుతోంది.ప్రపంచ వ్యాప్తంగా జూలై 10న రిలీజైన 'బాహుబలి' మూడో వారం కూడా తన హవా కొనసాగిస్తోంది. హిందీలో ఈ సినిమా ఇప్పటివరకూ 90కోట్లు వసూలు చేసింది. త్వరలో ఈ సినిమా 100కోట్ల మార్క్ కు చేరుకోబోతోంది. బాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ లోనూ బాహుబలి తానేంటో నిరూపిస్తోంది. ఈ దెబ్బతో సినిమాలో నటించిన వారందరూ ఒక్కరిగా ఓ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్నారు.

ముఖ్యంగా తమన్నా అయితే బాహుబలి తో తన మార్కెట్ ను ఇంకా పెంచుకోంది. దీంతో ఆమెకు కోలీవుడ్, బాలీవుడ్ లలో వరుస ఆఫర్లు వచ్చి చేరుతున్నాయి. బాలీవుడ్ లో ఆమె చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడడంతో, ఆతరువాత ఆమెకు సరైన ఆఫర్లు దక్కలేదు. మళ్ళీ బాహుబలితో బాలీవుడ్ ప్రొడ్యూసర్ లు ఆమె వెంటపడుతున్నారు. దీంతో బాహుబలి కోసం తమన్నా పడిన కష్టానికి మంచి ఫలితాలు దక్కుతున్నాయని ఇండస్ట్రీ టాక్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.