English | Telugu

రాజ‌మౌళిని ఏకిప‌డేసిన తాప్సి

ఈమ‌ధ్య క‌థానాయిక‌లు మాట‌ల జారుతున్నారు. హీరోల‌పై, ద‌ర్శ‌కుల‌పై ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మొన్నామ‌ధ్య రాధిక ఆప్టే... తెలుగు హీరోల ఆధిప‌త్య తీరుపై మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాప్సి... రాజ‌మౌళిని టార్గెట్ చేసింది. లోక‌మంతా బాహుబ‌లిని కీర్తిస్తుంటే... ఈ అమ్మ‌డు మాత్రం పెద‌వి విరిచింది. సినిమా గొప్ప‌గా ఉంద‌ని, అయితే హీరోయిన్ల‌ను పోట్ర‌యిట్ చేసిన విధానం ఏమాత్రం బాగోలేద‌ని, రాజ‌మౌళి స్థాయికి ఇది త‌గ‌ద‌ని సూటిగా చెప్పేసింది ఈ పంజాబీ ప‌డుచు.

ముఖ్యంగా అవంతిక పాత్ర‌లో త‌మ‌న్నాని మ‌ల‌చిన విధానంపై విరుచుకుప‌డింది. ఈ పాత్ర ఉద్దేశం ఏమిటో త‌న‌కు అర్థంకాలేద‌ని, మిగిలిన పాత్ర‌ల‌న్నింటికంటే ఆ పాత్ర అధ్వానంగా ప్ర‌వ‌ర్తించింద‌ని ఏకిప‌డేసింది. హీరోయిన్ అంటే.. హీరోల కోసం ప‌డి చ‌చ్చిపోయే పాత్ర‌లుగానే ఎందుకు మ‌లుస్తారో అర్థం కాద‌ని, ఓ క‌థానాయిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.

తాప్సి మాట‌ల్లో నిజం లేక‌పోలేదు. ఈ సినిమాలో బ‌ల‌హీన‌మైన పాత్ర అవంతిక‌దే. త‌న‌కేదో పెద్ద ఆశ‌యం ఉన్న‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చి.. చివ‌రికి తాను ఓ సామ‌న్యురాలిగానే ఓ మ‌గాడి ప్రేమ‌కు క‌రిగిపోయి, త‌న‌కి లొంగిపోవ‌డం... ఎవ్వ‌రికీ న‌చ్చ‌లేదు. ఇలాంటి కామెంట్ల‌ను రాజ‌మౌళి లైట్‌గానే తీసుకొంటాడేమో. కానీ త‌మ‌న్నా మాత్రం కౌంట‌ర్ ఇచ్చే ఛాన్సులున్నాయి. మొత్తానికి చిత్ర‌సీమ‌లో తాప్పి వ‌ర్సెస్ త‌మన్నా వార్ మొద‌ల‌వ్వ‌డానికి బోల్డంత ఆస్కారం ఉంద‌న్న‌మాట‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.