English | Telugu

'భగవంత్ కేసరి' బుకింగ్స్ కి సూపర్ రెస్పాన్స్!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ కాగా, సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

బాలకృష్ణ, అనిల్ రావిపూడి ఇద్దరూ తమ ట్రాక్ మార్చి చేసిన 'భగవంత్ కేసరి'పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇందులో మాస్ మెచ్చే యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే బలమైన ఎమోషన్స్ ఉండటంతో.. ఇది దసరా పండుగ సీజన్ కి పర్ఫెక్ట్ ఫిల్మ్ అనే అభిప్రాయాలు ఉన్నాయి. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి ఘన విజయాలతో జోరు మీదున్న బాలయ్య.. 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ఇటీవల యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 'అఖండ', 'వీరసింహారెడ్డి' తర్వాత బాలయ్య వరుసగా మూడోసారి యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే తేడా లేకుండా దాదాపు బుకింగ్స్ ఓపెన్ అయిన అన్ని ఏరియాల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. 'భగవంత్ కేసరి' బాలయ్య కెరీర్ లో రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనిపిస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.