English | Telugu

కాంచి దర్శకత్వంలో సుమంత్...!

ఈ మధ్య సినీకథారచయితలు అందరు కూడా దర్శకత్వం చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం అదే జాబితాలోకి ప్రముఖ కథా రచయిత ఎస్.ఎస్.కాంచి చేరారు.కాంచి కథ అందించిన "మర్యాద రామన్న" చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన కథ అందించిన "ఏమో గుర్రం ఎగరావచ్చు" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సుమంత్ హీరోగా నటించాడు. త్వరలోనే సుమంత్ హీరోగా కాంచి ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే కాంచి చెప్పిన కథ సుమంత్ కు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళనుందో త్వరలోనే తెలియనుంది.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.