English | Telugu

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం పదవిపై సుమన్ కీలక వ్యాఖ్యలు


సుమన్(Suman).. ఈ పేరుకి తెలుగు సినిమా ప్రేక్షకులకి మధ్య ఉన్న అనుబంధానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే సుమన్ సినీ జీవితం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చాలా ఉందనే విషయాన్నీ ప్రేక్షకులే గుర్తు చేస్తారు. అంతలా సుమన్ కి ప్రేక్షకులకి మధ్య అనుబంధం ఉంది. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నా తమ గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారు. రీసెంట్ గా సుమన్ ఒక ఇంటర్వ్యూ లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.


సుమన్ మాట్లాడుతు మన లైఫ్ లో ఎదుటి వ్యక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. అందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఉదాహరణ. చాలా మంది పవన్ ని తక్కువ అంచనా వెయ్యడంతో పాటు ఫస్ట్ టైమ్ ఎన్నికల్లో నిలబడినప్పుడు ఎగతాళి చేశారు. దురదృష్టవశాత్తూ రెండు చోట్లా ఓడిపోయారు. కానీ రాజకీయాలని వదలకుండా గ్రౌండ్ లెవల్‌కి వెళ్లి కష్టపడ్డాడు. పవన్ కి ప్రధాన బలం అభిమానులు. కష్టాల్లోను ఆ అభిమానులు పవన్ ని వదిలిపెట్టలేదు. నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపండి అని జనాల్లోకి వెళ్లారు. అందుకే ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు.

చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు పవన్ జైలుకి వెళ్లి పరామర్శించి పొత్తు ప్రకటించడం కూడా కలిసొచ్చింది. తాను ఆంధ్రప్రదేశ్‌కి డిప్యూటీ సీఎం అవుతానని పవన్ అసలు ఊహించి ఉండరు. ఇప్పుడు ఆయన టైమ్ నడుస్తుంది. అందుకే నేను మొదట నుంచి టైంని నమ్ముతాను. ఏ టైం అయితే పవన్ ని ఓడగొట్టిందో, అదే టైం డిప్యూటీ సిఏం గా కూర్చోబెట్టింది.

Also read: అదొక సామ్రాజ్యం.. స్వయంభు రిలీజ్ డేట్ పై కీలక అప్డేట్ ఇచ్చిన నిఖిల్

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఏపీ ప్రభుత్వంలో నంబర్ టూ స్థాయికి పవన్ వెళ్లడం నిజంగా అద్బుతం. చంద్రబాబు(Chandrababu Naidu)ఎక్స్‌పీరియన్స్‌ పవన్ కి బాగా ఉపయోగపడుతోంది. పవన్ క్రౌడ్ పుల్లర్, చంద్రబాబు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. వీరిద్దరి కలయిక వల్ల ఏపిలో పరిపాలన గత ప్రభుత్వ పరిపాలన కంటే పర్లేదు. రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని కూడా సుమన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.


'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.