English | Telugu

తెలంగాణ పోలీసుల అదుపులో యాంకర్ సుమ కొడుకు

డాక్టర్ అవుదామనుకొని యాక్టర్ అయిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది ఉంటారు. కానీ యాక్టర్ నుంచి యాంకర్ గా మారిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన అవకాశాన్ని పొందిన ఆ నటి, యాంకర్ ఎవరో కాదు సుమ కనకాల. తాజాగా సుమ కనకాల కొడుక్కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

సుమ కనకాల కొడుకు పేరు రోషన్ కనకాల. 2016 లో వచ్చిన నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసిన రోషన్,తాజాగా బబుల్ గమ్ అనే సినిమా ద్వారా పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా అతన్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసారు. ఒక కారులో వెళ్తున్న అతన్ని తెలంగాణాలో ఉన్న ఎన్నికల కోడు దృష్ట్యా పోలీసులు కారుని చెక్ చెయ్యడానికి ఆపారు. దాంతో అతను నా వెహికిల్ ఎందుకు ఆపారని ప్రశ్నించడంతో విషయం చెప్పిన పోలీసులు కారు ని చెక్ చెయ్యాలంటే అతను ఒప్పుకోలేదు. ఆ తర్వాత పోలీసులు రోషన్ ని అదుపులోకి తీసుకొని కారులో ఉన్న సూట్ కేసులతో సహా స్టేషన్ కి తీసుకెళ్లారు.

కాకపోతే ఇక్కడే ఒక గమ్మత్తు ఉంది. రోషన్ కారుని పోలీసులు ఆపడం, రోషన్ ని, అతని దగ్గర ఉన్న సూట్ కేసులని తీసుకెళ్లడం వరకు నిజమే. కాకపోతే సూట్ కేసులని ఓపెన్ చేశాకే అసలు మ్యాటర్ తెలిసింది. సూట్ కేసుల్లో బబుల్ గమ్స్, జిలేబీలు ఉన్నాయి.బబుల్ గమ్ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఆ వీడియో చేసి యూట్యూబ్ లో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కొంతమంది ఆ వీడియో చూసి నిజంగానే రోషన్ ని అరెస్ట్ చేసారని అనుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న రోషన్ ఆరెస్ట్ వార్తలపై సుమ కూడా స్పందించి అదంతా ఫ్రాంక్ వీడియో అని చెప్పింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.