English | Telugu

SSMB29 నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ‘కుంభ’ ఫస్ట్‌లుక్‌!

మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్టర్‌ ద్వారా ‘కుంభ’ గెటప్‌లో ఉన్న పృథ్విరాజ్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వీల్‌చైర్‌లో కూర్చుని, రోబోటిక్‌ సపోర్ట్‌తో ఉన్న శక్తివంతమైన వ్యక్తిగా కనిపించారు. వీల్‌ చైర్‌లో ఉంటూ ఎన్నో అద్భుతాలు సృష్టించిన శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ గురించి మనకు తెలుసు. అతని స్ఫూర్తితోనే కుంభ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశారని అర్థమవుతోంది.

SSMB29కి సంబంధించి నవంబర్‌ 15న మరిన్ని అప్‌డేట్స్‌ రాబోతున్నాయి. ఈ సినిమా టైటిల్‌ ఏమిటి అనే విషయంలో ఇప్పటివరకు రకరకాల చర్చలు జరిగాయి. అయితే ఈ సినిమాకి ఏ టైటిల్‌ పెడతారు అనే విషయంలో నవంబర్‌ 15న క్లారిటీ రాబోతోంది. అదే రోజున మహేష్‌ ఫస్ట్‌లుక్‌తోపాటు 2 నిమిషాల నిడివి ఉన్న కాన్సెప్ట్‌ వీడియోను కూడా రిలీజ్‌ చెయ్యబోతున్నారు.

టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు ప్రపంచవ్యాప్తంగా మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి ఫస్ట్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్‌ అడ్వెంచర్‌ జోనర్‌లో ఉండబోతోంది. ఇప్పటివరకు మహేష్‌ కనిపించని ఒక డిఫరెంట్‌ లుక్‌లో రాబోతున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్‌ హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

కుంభ పాత్రలో అతని నటనను చూసిన రాజమౌళి ‘ఫస్ట్‌ షాట్‌ తీసిన వెంటనే పృథ్వీ దగ్గరికి వెళ్లి.. నేను చూసిన అత్యంత గొప్ప నటుల్లో నువ్వు ఒకరు అని చెప్పాను. ఈ దుర్మార్గుడైన, నిర్దాక్షిణ్యమైన, శక్తివంతమైన ప్రతినాయకుడు ‘కుంభ’ పాత్రకు జీవం పోయడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఈ కుర్చీలో అక్షరాలా నువ్వు జారిపోయి ఆ పాత్రలో కలిసిపోయినందుకు ధన్యవాదాలు పృథ్వీ’ అంటూ పోస్ట్‌ చేశారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.