English | Telugu

సత్యమూర్తిని నడిపిస్తున్న త్రివిక్రమ్

స‌న్నాఫ్ స‌త్య‌మూర్తికి విప‌రీత‌మైన డివైడ్ టాక్ వచ్చిన కలెక్షన్లు మాత్రం బాగానే రాబడుతోంది. దీనికి అసలు కారణం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అని అందరూ అంటున్నారు. వేసవి సెలవులు కావడంతో సినిమా బాలేదు అంటున్నా.. త్రివిక్రమ్ సినిమా ఎలా ఉందో ఓసారి చూసొద్దాం.. అనేవాళ్లే ఎక్కువ‌య్యారు. దీంతో ఈ సినిమా వసూళ్ళ పండగ చేసుకొంటోంది. ఈ వీకెండ్ విడుదలైన ‘ఓకే బంగారం’ A సెంటర్స్‌లో పోటీ ఇస్తున్నా.. B-C కేంద్రాల్లో ‘సత్యమూర్తి’కి ఈ గురువారం వరకు కలెక్షన్స్ బాగానే వస్తాయని సమాచారం. 23న వైజాగ్‌లో భారీగా థాంక్యూ మీట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పదకొండు రోజుల కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి.

నైజాం-12 కోట్ల 3 లక్షలు
సీడెడ్- 5.33
ఉత్తరాంధ్ర- 3.20
గుంటూరు- 2.81
ఈస్ట్ గోదావరి- 2.28
కృష్ణా- 2.11
వెస్ట్ గోదావరి- 1.96
నెల్లూరు-1.13
టోటల్ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ కలెక్షన్: 30 కోట్ల 85 లక్షలు.
ఓవర్సీస్- 6.20,
కర్నాటక 5.25,
రెస్టాఫ్ ఇండియా-1.34.
టోటల్ వరల్డ్ వైడ్ 43 కోట్ల 64 లక్షలు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.