English | Telugu

యస్.యమ్.యస్.ఆడియో రిలీజ్

యస్.యమ్.యస్.ఆడియో రిలీజ్ జనవరి 22 న, హైదరాబాద్ శిల్పారామంలో కల శిల్పకళా వేదికపై జరిగింది. యస్.యమ్.యస్. అంటే "శివ మనసులో శృతి". ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, ఆర్.బి. చౌదరి నిర్మిస్తున్నారు. "భీమిలీ కబడ్డి జట్టు" ఫేం తాతినేని సత్య దర్శకత్వంలో, సుధీర్ హీరోగా నటించగా ఈ యస్.యమ్.యస్. చిత్రాన్ని నిర్మించారు. ఈ యస్.యమ్.యస్.చిత్రం ఆడియో రిలీజ్ ప్రిన్స్ మహేష్ బాబు చేతుల మీదుగా, తొలి సి.డి.ని దర్శకుడు వి.వి.వినాయక్ అందుకోగా, సెల్వ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజిక్ వేగ ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయబడింది.

ఈ యస్.యమ్.యస్. చిత్రం ఆడియో విడుదల్లో హీరో సుధీర్ తాను సినిమాలో చేసిన ఫీట్లు అంటే మోకాళ్ళతో మూన్ వాక్ వంటివి వేదికపై స్వయంగా చేసి ఆహూతులనలరించారు. ఈ యస్.యమ్.యస్. చిత్రం ఆడియో విడుదలకు సూపర్ స్టార్ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, దర్శకుడు సుకుమార్, వినాయక్ తదితరులు విచ్చేసి, ఈ చిత్రం ఆడియో, అలాగే ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించాలని ఆశించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.