Read more!

English | Telugu

భర్తతో ఫోటో దిగిన శృతిహాసన్, పెళ్లైపోయిందా..?

నా భర్తతో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లంచ్ చేస్తున్నాను.. ఇదీ శృతీ హాసన్ ఫేస్ బుక్ లోని పోస్ట్. ఒక్కసారిగా శృతి ఫేస్ బుక్ ఫాలోవర్లందరికీ షాక్ తగిలింది. భర్తేంటి..? పెళ్లెప్పుడైంది..? ఇవీ జనాల మైండ్స్ లో వచ్చిన ప్రశ్నలు. ఆమె ఫ్యాన్స్ లో సగానికి సగం మందికి దాదాపు హార్ట్ అటాక్ వచ్చేసింది. ఎప్పుడు పెళ్లైంది, ఎక్కడ పెళ్లైంది అంటూ శృతిని ప్రశ్నలతో హింసించేశారు. ఇంతకీ అసలు విషయమేంటంటే, నిరంజన్ అయ్యంగార్ శృతికి చాలా మంచి స్నేహితుడు. అతనితో కలిసి లంచ్ కు వెళ్లిన శృతికి అక్కడ మెనూ కార్డ్ లో ఐటెమ్స్ అన్నీ హాలీవుడ్ టీవీ సీరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ పేరుతో ఉన్నాయి. అవి చూస్తున్న టైంలోనే తనకు కూడా ఎవరినైనా టీజ్ చేయాలనిపించిందట. ఎవరో ఎందుకు ఆమె ఫేస్ బుక్ లోనే లక్షల మంది ఫాలోవర్లున్నారు కదా అని సరదాగా ఒక ఫోటోతో పోస్ట్ పెట్టి, నా భర్తతో లంచ్ అని క్యాప్షన్ పెట్టింది. అదీ అసలు మ్యాటర్. పోస్ట్ కింద కామెంట్స్ లో జనాలు గోలెట్టేస్తుండటంతో, పోన్లే పాపం అని నిజం చెప్పేసింది శృతి. అప్పటికి గానీ కుర్రాళ్ల గుండె దడ తగ్గలేదు పాపం..