English | Telugu

శంకర్ దాదా మళ్ళీ వస్తున్నాడు!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎవర్ గ్రీన్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో 'శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్' ఒకటి. జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2004 అక్టోబర్ 15న విడుదలై ఘన విజయం సాధించింది. ఇందులో చిరంజీవి కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విడుదలై 19 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకి ఎందరో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా మరోసారి థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతోంది.

టాలీవుడ్ లో కొంతకాలంగా రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. పలు సినిమాలు రీ రిలీజ్ లోనూ వసూళ్ళ వర్షం కురిపించాయి. ఇప్పుడు శంకర్ దాదా కూడా అదే బాటలో పయనించేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని నవంబర్ 4న రీ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

'శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్' చిత్రంలో ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది రీ రిలీజ్ కి పర్ఫెక్ట్ మూవీ. ఇది సందేశాత్మక చిత్రం అయినప్పటికీ పూర్తి వినోద భరితంగా ఉంటుంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. అదిరిపోయే కామెడీ సన్నివేశాలు, పాటలతో బిగ్ స్క్రీన్ మీద మరోసారి ఈ సినిమాని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయవచ్చు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.