English | Telugu

దర్శకుడు సంపత్ నంది ఇంట్లో తీవ్ర విషాదం 

-సంపత్ నంది ఇంట్లో విషాదం
-రచ్చ తో చరణ్ కి సూపర్ హిట్
-ప్రస్తుతం భోగి పనుల్లో బిజీ

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)ఆరంజ్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత 'రచ్చ'తో సూపర్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. రచ్చ కి ముందు చాలా పెద్ద పెద్ద దర్శకులే చరణ్ కి కథ చెప్పినా నచ్చలేదు. అసలు ఎలాంటి కథతో సినిమా చెయ్యాలనే మీమాంసలో కూడా మెగా కాంపౌండ్ ఉంది. అలాంటి టైం లో రచ్చ కథ చెప్పి ఒప్పించిన దర్శకుడు 'సంపత్ నంది'(Sampath Nandi). దీన్ని బట్టి రచయితగా, దర్శకుడిగా సంపత్ నంది క్యాపబిలిటీ ని అర్ధం చేసుకోవచ్చు. రచ్చ విజయంతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు.

.

రీసెంట్ గా సంపత్ నంది తండ్రి నంది కిష్టయ్య(Nandi Kishtayya)చనిపోయారు, నిన్న రాత్రి మరణించగా పలువురు సినీ ప్రముఖులు సంపత్ నంది కి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నారు. కిష్టయ్య వయసు 73 సంవత్సరాలు. అనారోగ్య కారణాల వల్ల చనిపోయినట్టుగా తెలుస్తుంది. సంపత్ నంది కెరీర్ విషయానికి వస్తే బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సిటిమార్ వంటి హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. నిర్మాతగాను పలు విభిన్న సినిమాలని అందించాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో వచ్చిన ఓదెల పార్ట్ 2 సంపత్ కథ, నిర్మాణ సారధ్యంలో వచ్చిందే.

also read:బాహుబలి ఎపిక్ ఓటిటి డేట్ పై రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నాడా!


ప్రస్తుతం 'శర్వానంద్'(Sharwanand)హీరోగా భోగి(Bhogi)అనే కొత్త మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. 2010 లో 'ఏమైంది ఈ వేళ' అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన సంపత్ నంది స్వస్థలం తెలంగాణాలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఓదెల.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .