English | Telugu

కాజల్ 5 లక్షలు, సమంత 10 లక్షల విరాళం

హుద్‌హుద్‌ తుపాను బాధితులకు అండగా నిలిచేందుకు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఒకరి తరువాత ఒకరు ఆంధ్రప్రదేశ్‌ సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా హీరోలు తుపాను బాధితుల సహాయార్థం ప్రకటించగా, లేటెస్ట్ గా సినీ నటిలు సైతం తాము వంతు సహాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ రోజు ఉదయం ఐదు లక్షల విరాళాన్ని ప్రకటించగా, హీరోయిన్‌ సమంత 10లక్షలు విరాళాన్ని ప్రకటించింది. సమంత పర్సనల్‌గా 5 లక్షలు, ప్రత్యూష సపోర్ట్‌ ఫౌండేషన్‌ తరఫున 5 లక్షలు మొత్తం 10 లక్షలు విరాళంగా ప్రకటించింది. మరోవైపు ఊహలు గుసగుసలాడే’ ఫేం రాశి ఖన్నా కూడా తుపాను బాధితులకు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చింది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.