English | Telugu

ప్రభాస్ ఫాన్స్ ఎగరేయండి కాలర్..సలార్ ఉత్తరాంధ్ర రికార్డు 

డిసెంబర్ 22 కి ఉన్న స్పెషల్ ఏంటి అని ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఎవర్నడిగినా వెంటనే చెప్తారు. అంతలా ఆ డేట్ ఇప్పుడు భారతీయుల్లో స్థానాన్ని సంపాదించింది. డిసెంబర్ 22 న ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ రిలీజ్ అవుతుంది. రిలీజ్ కి ముందే సలార్ గురించి రోజుకో వార్త ఫిలిం మార్కెట్ లో చక్కర్లు కొడుతుంది. తాజాగా సలార్ మూవీ కి సంబంధించిన రికార్డు ఒకటి బయటకి వచ్చి ప్రభాస్ ఫాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేస్తుంది.ప్రభాస్ సలార్ సినిమా ఆల్ ఏరియాస్ లో కూడా రికార్డు లెవెల్లో బిజినెస్ ని జరుపుకుంటుంది. ఒక్కో ఏరియాలో ఒక్కో రికార్డు ని సాధించుకుంటు భారతీయ చిత్రపరిశ్రమ ఖ్యాతిని పెంచుతుంది. తాజాగా ఉత్తరాంధ్రకి సంబంధించిన సలార్ రికార్డు ఒకటి బయటకి వచ్చింది. సలార్ మూవీ ఉత్తరాంధ్ర ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులని 20 కోట్ల రూపాయలకి ప్రముఖ పంపిణీదారులు తీసుకున్నారు.ఇప్పుడు ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తమ అభిమాన హీరో సినిమా సలార్ రిలీజ్ కి ముందే సరికొత్త రికార్డు లని సృష్టిస్తుంటే రిలీజ్ అయ్యాక మరిన్ని కొత్త రికార్డు లు సృష్టించడం ఖాయమని అంటున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.