English | Telugu

సాదాసీదాగా "సాహసం" !!

ఒకటిన్నర సంవత్సరం అనంతరం గోపీచంద్ సినిమా విడుదలవుతోంది. అయినా సరే, ఎందుకోగానీ ఆ చిత్రానికి మినిమమ్ క్రేజ్ కూడా లేకుండాపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ చిత్రం "సాహసం". గోపీచంద్ ప్రీవియస్ మూవీస్ "వాంటెడ్, మొగుడు" చిత్రాలు అట్టర్‌ ఫ్లాపవ్వడం ఇందుకు ఒక కారణమైనప్పటికీ.. పరిస్థితి మరీ ఇంత ఘోరంగా ఉండడంపై కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు చిత్ర పరిశీలకులు.

"సాహసం"లో జంటగా నటిస్తున్న గోపీచంద్_తాప్సీ ఇంతకుముందు "మొగుడు"లో నటించారు. అలాగే "సాహసం" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న "చంద్రశేఖర్ ఏలేటి" ఇంతకుమునుపు గోపీచంద్‌తో "ఒక్కడున్నాడు" చిత్రం తీసారు. ఈ రెండు చిత్రాలు (మొగుడు, ఒక్కడున్నాడు) బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లాపడ్డాయి.

ఇకపోతే "సాహసం" చిత్రం నిర్మిస్తున్న బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఇంతకుముందు "దేవుడు చేసిన మనుషులు_ఒంగోలు గిత్త" వంటి "కళాఖండాలు" నిర్మించి ఉన్నారు. ఈ కారణాలన్నిటివల్ల.. "సాహసం" చిత్రం ఈనెల 12న అత్యంత సాదాసీదాగా విడుదలవుతోంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలవుతున్న "సాహసం" రేపు విడుదలయ్యాక అద్భుతాలేమైనా చేస్తుందేమో చూడాల్సిందే!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.