English | Telugu

సదా ఇంట్లో తీవ్ర విషాదం..వారం తర్వాత వీడియో బయటకి  

'జయం'తో సినీరంగ ప్రవేశం చేసిన 'సదా', మొదటి చిత్రంలోనే అగ్ర హీరోయిన్ రేంజ్ లో పెర్ ఫార్మ్ ని ప్రదర్శించి, ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ఈ చిత్రానికి గాను ప్రతిష్టాత్మక 'ఫిలింఫేర్ అవార్డు'ని సైతం అందుకున్న సదా, ఆ తర్వాత ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోతో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు పొందింది.

వారం రోజుల క్రితం సదా తండ్రి 'సయ్యద్' మరణించడం జరిగింది. కానీ ఈ విషయాన్నీ సదా రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ద్వారా వెల్లడి చేసింది. అందులో ఆమె ఎమోషనల్ గా మాట్లాడుతు 'మా నాన్న చనిపోయి వారం రోజులు అవుతుంది. కానీ ఈ వారం రోజులు ఒక యుగంలా అనిపిస్తుంది. ఆయన మరణం నా జీవితానికి అతి పెద్ద లోటు.నేను సినిమాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడు, మా అమ్మతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరు వ్యతిరేకించారు. కానీ మా నాన్న నన్ను ప్రోత్సహించి, నాతో పాటు షూటింగ్ కి వచ్చి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆయన వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఒక క్లినిక్ కూడా ఏర్పాటు చేసి వైద్య పరంగా ఎంతో మందికి సేవలు కూడా చేసాడు. ఆయన కూతురుగా పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నానంటూ ఇనిస్టాగ్రమ్ లో వీడియో చేసింది. దీంతో పలువురు నెటిజన్స్ ఆమె తండ్రి మరణానికి సానుభూతిని తెలియచేస్తున్నారు.

మహారాష్ట్ర లోని రత్నగిరి చెందిన సదా, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకొని సుమారు సుమారు నలభై చిత్రాల వరకు చేసింది. బుల్లి తెరపై పలు టి వి షోస్ కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న సదా, ఇప్పటి వరకు ఇలా పెళ్లి చేసుకోలేదు.



'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.