English | Telugu

రుద్రమదేవి విడుదలెప్పుడో?

గుణ శేఖర్ కి తనపై తనకి నమ్మకం పోయిందా? కదనరంగంలోకి దూకుతా అంటున్న రుద్రమదేవిని వెనక్కు లాగుతున్నాడా? తన సినిమాని బాహుబలితో కంపేర్ చేసుకుంటున్నాడా?. రుద్రమదేవి వాయిదా పడుతోంది అన్న వార్త విన్నవాళ్లంతా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు.

షూటింగ్ మొదలైనప్పటి నుంచి రిలీజ్ డేట్ ప్రకటించే వరకూ పురిటినొప్పులు ఎదుర్కొన్న రుద్రమదేవికి మళ్లీ బ్రేక్ వేస్తున్నారని వార్తలు రావడంతో అసలు ఈ సినిమాకు మోక్షం ఉంటుందా అంటూ సెటైర్లు పడుతున్నాయి. అయితే ఈ చిత్రం వాయిదా వెనుక ఆర్థిక ఇబ్బందులు కారణం కాదట. గ్రాఫిక్స్ తేలిపోయినట్టున్నాయని గుణశేఖర్ సన్నిహులు తేల్చిచెప్పారట.

క్వాలిటీపై దృష్టిపెట్టకుంటే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారట. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న రుద్రమదేవికి మరింత పదునుపెట్టే పడ్డాడట గుణ.
మొత్తానికి దాదాపు 70కోట్ల వ్యయంతో నిర్మించిన రుద్రమదేవి గుణశేఖర్ ను నిలువునా ముంచిందని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదలెప్పుడో చూద్దాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.