English | Telugu

మళ్ళీ అదే రిపీట్ చేస్తున్న బన్నీ

బన్నీ హీరోగా నటించిన తాజా చిత్రం "ఇద్దరమ్మాయిలతో". ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీ కొత్త గెటప్ తో కనిపించడం, అదే విధంగా మైక్ పట్టుకొని పడటం, వయోలిన్ వాయించడం వంటి కొత్త స్టైల్ తో అభిమానులను అలరించాడు. అయితే ఈ మైక్, గిటార్ మళ్ళీ రిపీట్ కాబోతున్నాయి.

ప్రస్తుతం బన్నీ నటిస్తున్న చిత్రం "రేసుగుర్రం". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం మిలన్ లో జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్ల్స్ మీకోసం...

అయితే ఇందులో ఒక పాట కోసం బన్నీ మరోసారి మైక్ పట్టుకొని, వయోలిన్ కూడా వాయించాడు. మరి ఈ చిత్రం కూడా అలాంటి విజయాన్నే సొంతం చేసుకుంటుందో లేదో త్వరలోనే తెలియనుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.