English | Telugu

దీపావళి పండగను ఇలా జరుపుకోండి.. అందరూ హ్యాపీగా ఉంటారు!

ఎంతో కాలం క్రితమే సినిమాల్లో నటించడం మానేసిన రేణు దేశాయ్‌.. తన అభిమానులతో మాత్రం ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. సందర్భం ఏదైనా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా దీపావళి పండగ సందర్భంగా రేణు పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ దీపావళి. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోంది. క్రాకర్స్‌తో సందడి చేసేందుకు సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో సరదాగా క్రాకర్స్‌ కాల్చడం మనం చూస్తున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రేణు పెట్టిన పోస్ట్‌ను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు.

‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పండగను అందరూ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పండగను అందరూ ఎంతో ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. అయితే రాత్రి 9 గంటల తర్వాత భారీ శబ్దాలు చేసే క్రాకర్లు కాల్చకండి. ఎందుకంటే వృద్ధులు, పిల్లలు, మూగజీవాలు ఆ శబ్దాలకు భయపడే అవకాశం ఉంది. ఎక్కువ శబ్దం చేయకుండా కేవలం లైటింగ్‌తో పండగను జరుపుకోవాలని కోరుతున్నాను’ అంటూ పోస్ట్‌ చేశారు రేణు దేశాయ్‌. ఆమె పెట్టిన పోస్టుకు చాలా మంచి స్పందన వస్తోంది. ‘చాలా మంచి విషయాన్ని మాతో షేర్‌ చేసుకున్నారు’, ‘మూగ జీవాల పట్ల మీకున్న ప్రేమను మరోసారి అందరితో షేర్‌ చేసుకున్నారు’ అంటూ రేణు దేశాయ్‌ను అప్రిషియేట్‌ చేస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం