English | Telugu

దీపావళి పండగను ఇలా జరుపుకోండి.. అందరూ హ్యాపీగా ఉంటారు!

ఎంతో కాలం క్రితమే సినిమాల్లో నటించడం మానేసిన రేణు దేశాయ్‌.. తన అభిమానులతో మాత్రం ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. సందర్భం ఏదైనా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా దీపావళి పండగ సందర్భంగా రేణు పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ దీపావళి. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోంది. క్రాకర్స్‌తో సందడి చేసేందుకు సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో సరదాగా క్రాకర్స్‌ కాల్చడం మనం చూస్తున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రేణు పెట్టిన పోస్ట్‌ను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు.

‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పండగను అందరూ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పండగను అందరూ ఎంతో ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. అయితే రాత్రి 9 గంటల తర్వాత భారీ శబ్దాలు చేసే క్రాకర్లు కాల్చకండి. ఎందుకంటే వృద్ధులు, పిల్లలు, మూగజీవాలు ఆ శబ్దాలకు భయపడే అవకాశం ఉంది. ఎక్కువ శబ్దం చేయకుండా కేవలం లైటింగ్‌తో పండగను జరుపుకోవాలని కోరుతున్నాను’ అంటూ పోస్ట్‌ చేశారు రేణు దేశాయ్‌. ఆమె పెట్టిన పోస్టుకు చాలా మంచి స్పందన వస్తోంది. ‘చాలా మంచి విషయాన్ని మాతో షేర్‌ చేసుకున్నారు’, ‘మూగ జీవాల పట్ల మీకున్న ప్రేమను మరోసారి అందరితో షేర్‌ చేసుకున్నారు’ అంటూ రేణు దేశాయ్‌ను అప్రిషియేట్‌ చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.